రైల్వే బోర్డు హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను మంజూరు చేసిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇది హైదరాబాద్కు కనెక్ట్ అయిన మూడో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అవుతుంది. నగరం నుండి మొదటి సర్వీస్ ముజఫర్పూర్కు ఉంది. తిరువనంతపురం నుండి మరొక రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ప్రారంభించారు.

అమృత్ భారత్ రైలులో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్(నాన్ ఏసీ)లు ఉంటాయని అధికారులు తెలిపారు. కార్యకలాపాల ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతుంది. త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు.
అమృత్ భారత్ రైళ్లను సుదూర ప్రయాణికులకు బడ్జెట్ ఫ్రెండ్లీ సేవలుగా రూపొందించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు దాదాపు 800 కి.మీ దూరంలో ఉన్న లేదా 10 గంటల కంటే ఎక్కువ ప్రయాణం అవసరమయ్యే ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తాయి.
సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే దీనిని ప్రారంభం జరగనుంది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మార్పు
మరోవైపు రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ - యశ్వంతపూర్ - కాచిగూడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ టైమింగ్స్లో మార్పులు చేసింది. దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం... గతంలో ఉన్న టైమింగ్ ప్రకారం... యశ్వంతపూర్ - కాచిగూడ (ట్రైన్ నెంబర్ 20704) వందే భారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 03.48 నిమిషాలకు హిందూపూర్ చేరుకునేది. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 03.55 నిమిషాలకు చేరుకుని... మధ్యాహ్నం 03. 57 నిమిషాలకు బయల్దేరుతుంది.
కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.08 నిమిషాలకు హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకుని 12.10 నిమిషాలకుగు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చేరుకుని... 12.19 నిమిషాలకు బయల్దేరుతుంది. మారిన టైమింగ్స్ మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
{{/usCountry}}కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.08 నిమిషాలకు హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకుని 12.10 నిమిషాలకుగు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చేరుకుని... 12.19 నిమిషాలకు బయల్దేరుతుంది. మారిన టైమింగ్స్ మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
{{/usCountry}}