...
...
Next Story

INS Nipun : హెచ్‌ఎస్ఎల్ మరో ఘనత - భారత నావికాదళానికి ‘నిపుణ్’, వ్యూహాత్మక శక్తికి కొండంత బలం!

స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) రూపొందించిన డైవింగ్ సపోర్ట్ వెసెల్ 'నిపుణ్' నౌకను భారత నౌకాదళానికి అందజేసింది. ఇది భారత సముద్రగర్భ భద్రతా సామర్థ్యాన్ని మరింత పెంచనుంది.

Published on: Jul 31, 2026, 11:35:29 IST
Advertisement

INS Nipun : భారత సముద్రగర్భ వ్యూహాత్మక సామర్థ్యం, నావికాదళ సముద్ర భద్రతా సన్నద్ధత మరింత బలపడ్డాయి. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ 'హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్' (HSL) తమ నౌకా నిర్మాణ కేంద్రంలో రూపొందించిన అత్యంత ఆధునిక డైవింగ్ సపోర్ట్ వెసెల్ (DSV) 'నిపుణ్' నౌకను శుక్రవారం భారత నౌకాదళానికి అధికారికంగా అందజేసింది.

భారత నావికాదళానికి ‘నిపుణ్ (image source @PIB_India X)
భారత నావికాదళానికి ‘నిపుణ్ (image source @PIB_India X)

గతేడాదే 'ఐఎన్ఎస్ నిస్తార్' అనే నౌకను విజయవంతంగా తయారు చేసి భారత నావికాదళానికి అందించిన హిందుస్థాన్ షిప్‌యార్డ్… కేవలం ఏడాది వ్యవధిలోనే మరో సంక్లిష్టమైన యుద్ధనౌక 'నిపుణ్'ను పూర్తి చేసి రక్షణ రంగానికి అప్పగించడం విశేషం. స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం సాధిస్తున్న అపారమైన పురోగతికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అత్యంత సంక్లిష్టమైన వ్యూహాత్మక నౌకా వేదికలను సమర్థవంతంగా నిర్మించడంలో హెచ్‌ఎస్‌ఎల్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.

విశాఖపట్నంలో జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భారత నౌకాదళ ఉన్నతాధికారి, వెస్ట్రన్ నేవల్ కమాండ్ సీఎస్ఓ (టెక్), D448 కమిటీ చైర్మన్ రియర్ అడ్మిరల్ అర్వింద్ రావల్ (వీఎస్ఎమ్), హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురాం (రిటైర్డ్, వీఎస్ఎమ్) పాల్గొని నిపుణ్ డెలివరీకి సంబంధించిన అధికారిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

‘నిపుణ్’ నౌక ప్రత్యేకతలు, సాంకేతిక సామర్థ్యాలు

  • భారత నౌకాదళంలో చేరిన 'ఐఎన్ఎస్ నిపుణ్' అనేక ఆధునిక రక్షణ, సహాయక సామర్థ్యాలను కలిగి ఉంది.
  • ఈ నౌక పొడవు 118 మీటర్లు కాగా, ఇది సుమారు 8,560 టన్నుల బరువు (డిస్‌ప్లేస్‌మెంట్) కలిగి ఉంటుంది.
  • ఈ భారీ నౌక తయారీకి కావలసిన సామాగ్రిలో ఏకంగా 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని, ఉత్పత్తులనే ఉపయోగించారు.
  • డైనమిక్ పొజిషనింగ్, సాచ్యురేషన్ డైవింగ్, సబ్‌మెరైన్ రెస్క్యూ (సబ్‌మెరైన్ ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడటం) మరియు డీప్-సీ ఇంటర్వెన్షన్ (సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో కార్యకలాపాలు) వంటి సంక్లిష్టమైన విధులను ఇది నిర్వర్తిస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks