...
...
Next Story

ఏపీలో మెగా కంటైనర్ పోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది : నీతి ఆయోగ్ సీఈఓ

వైజాగ్ గ్రోత్ హబ్, పూర్వోదయ పథకం గురించి నీతి ఆయోగ్ సీఈఓ చర్చించారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్శించడానికి మెగా కంటైనర్ పోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Published on: Oct 23, 2025, 22:36:33 IST
Advertisement

నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రమణ్యం రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్‌తో కలిసి చర్చించారు. తీరప్రాంత అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో పూర్వోదయ పథకం, విశాఖపట్నం గ్రోత్ హబ్ గురించి మాట్లాడారు. తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందుందని, పూర్వోదయ కార్యక్రమం కింద మరింత అభివృద్ధికి అపారమైన అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో అనేక ఓడరేవులు ఉన్నప్పటికీ, వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి మెగా కంటైనర్ పోర్టును ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర వినూత్న అభివృద్ధి పథకాలపై త్వరలో జరగనున్న ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ప్రత్యేక ప్రదర్శన కోసం వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ సీఈఓ.. ప్రధాన కార్యదర్శిని కోరారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్‌లను బలోపేతం చేసే ప్రణాళికలను కూడా నీతి ఆయోగ్ సీఈఓ సమీక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీ, పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచడంలో వాటి పాత్రను నొక్కి చెప్పారు.

‘కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లలో ప్రారంభించిన పూర్వోదయ పథకం, సాంస్కృతిక వారసత్వం, సహజ వనరులు, మానవ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జాతీయ వృద్ధికి కీలకమైన చోదకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.’ అని సుబ్రహ్మణ్యం అన్నారు.

ఈ పథకం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, పారిశ్రామిక కారిడార్లు వంటి ప్రధాన మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రాంతీయ కనెక్టివిటీ, ఉపాధి, నైపుణ్య అభివృద్ధిని పెంచుతుంది. విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందని నీతి ఆయోగ్ సీఈఓకు ప్రధాన కార్యదర్శి విజయానంద్ బదులిచ్చారు. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి రాష్ట్రం గణనీయమైన ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe