కర్నూలులోని ఓర్వకల్లు ఫార్మా హబ్‌గా అభివృద్ధి చెందుతోంది: ఏపీ ప్రభుత్వం

కర్నూల్‌లోని ఓర్వకల్లు ఫార్మా హబ్‌గా అభివృద్ధి చెందుతోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టాయని తెలిపింది.

Published on: Dec 15, 2025 2:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఫార్మా హబ్‌గా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓర్వకల్లులో పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

'ఔషధ తయారీకి ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది, హైదరాబాద్‌కు చెందిన విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.' అని అధికారిక పత్రికా ప్రకటన తెలిపింది.

యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్(APIలు), ఆర్గానిక్ కెమికల్స్ తయారీ సౌకర్యాన్ని స్థాపించడానికి ఓర్వకల్లు నోడ్‌లోని ఐపీ గుట్టపాడు క్లస్టర్‌లో 100 ఎకరాలకు పైగా కేటాయింపుకు విరూపాక్ష ఆర్గానిక్స్ ఆమోదం పొందింది. దీని పెట్టుబడి రూ.1,225 కోట్లు ఉంటుందని, లాజిస్టిక్స్, యుటిలిటీస్, అనుబంధ సేవలలో పరోక్ష ఉపాధితో పాటు, దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కూడా పెట్టుబడులు పెట్టనుంది.

ఇటీవల వైజాగ్‌లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో సంతకం చేసిన ఒప్పందాల ద్వారా విరూపాక్ష ఆర్గానిక్స్, సిగాచి ఇండస్ట్రీస్ విస్తరణ ప్రణాళికలు కన్ఫామ్ అయ్యాయి. ఓర్వకల్లులో ఔషధ, అనుబంధ తయారీ ప్రాజెక్టులు ఇప్పుడు కలుస్తుండటంతో, కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశంలో ఔషధ తయారీ గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మాసిటీ భూ సేకరణ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫార్మాసిటీకి బదులుగా ఫ్యూచర్ సిటీని తెరపైకి తీసుకొచ్చింది. అయితే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ సరిహద్దుకు చేరువలో ఉన్న కర్నూలు జిల్లాలో ఈ రెండు కంపెనీలకు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నాయి. హైదరాబాద్ నుంచి నాలుగు గంటల దూరంలో ఉన్న ఓర్వకల్లులో విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వస్తున్నాయి. హైదరాబాద్ దగ్గరగా ఉండటం, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నందును ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాయి.