Mobile Phones Recovery : మెుబైల్ ఫోన్ల రికవరీలో పల్నాడు టాప్.. రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా
Mobile Phones Recovery : పోగొట్టుకున్న మెుబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఎన్టీఆర్ జిల్లా రెండో స్థానంలో ఉంది.
పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలిచింది. 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలోనే అత్యధిక CEIR స్కోరును సాధించింది.

భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ, మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలను సీఈఐఆర్ అవార్డులతో సత్కరించింది.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐటీఎస్, డీడీజీ (సెక్యూరిటీ), ఏపీ ఎల్ఎస్ఏ హేమంత్ రాత్వేలతో కలిసి ఈ అవార్డులను ప్రదానం చేశారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటి యజమానులకు తిరిగి అప్పగించడంలో చేసిన విశేష కృషికి గాను పల్నాడు ఎస్పీ బి.కృష్ణారావు, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఏలూరు ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్లు ఉత్తమ రికవరీ అవార్డులు అందుకున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వ్యవస్థ పనితీరు విశ్లేషణ ఆధారంగా ఈ ర్యాంకింగ్లను రూపొందించారు. 69.75 రికవరీ స్కోరుతో పల్నాడు జిల్లా మొదటి ర్యాంకును సాధించి, 4,303 మొబైల్ ఫోన్లను రికవరీ చేసింది.
ఎన్టీఆర్ జిల్లా 2,929 ఫోన్లను స్వాధీనం చేసుకుని 64 స్కోరుతో రెండో స్థానంలో నిలవగా, ఏలూరు జిల్లా 2,796 ఫోన్లను స్వాధీనం చేసుకుని 62.18 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


