గోదావరి నదిపై పర్యాటక బోటు ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న పర్యాటకులకు లైన్ క్లియర్ అయింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఫెర్రీ పాయింట్ నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల వరకు శనివారం నుండి పర్యాటక బోటు సర్వీసులు ప్రారంభమయ్యాయి. భద్రతా తనిఖీలు (సేఫ్టీ ఆడిట్) విజయవంతంగా పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గత నెల జూన్ 14వ తేదీన భద్రతా కారణాలు, సాంకేతిక లోపాలను ఉటంకిస్తూ జిల్లా యంత్రాంగం పాపికొండల రూట్లో నడిచే పర్యాటక బోట్లను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. బోటు ఆపరేటర్లు అందరూ కచ్చితంగా సమగ్ర భద్రతా తనిఖీలు చేయించుకోవాలని, ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని అధికారులు అప్పట్లో ఆదేశించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బోటు నిర్వాహకులు తమ పడవలకు సంబంధించిన అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పూర్తి చేశారు. లైఫ్ జాకెట్లు, అగ్నిమాపక పరికరాలు, బోటు కండిషన్ వంటి కీలక అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ సేఫ్టీ ఆడిట్ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో, పర్యాటకుల భద్రతపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే బోట్ల పునరుద్ధరణకు పచ్చజెండా ఊపారు.
గండిపోశమ్మ ఘాట్ వద్ద ఉదయం నుంచే బోటు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాపికొండల విహారయాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులు అధికారిక కౌంటర్లు లేదా గుర్తింపు పొందిన ఆపరేటర్ల ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలి. సిబ్బంది సూచనలను పాటించాలి.
గోదావరి నదిలో పాపికొండలు పర్యటనకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సంఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటకుల భద్రతపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే.. విహార యాత్ర తాత్కాలికంగా నిలిపివేసి బోట్లను తనిఖీలు చేశారు.
{{/usCountry}}గోదావరి నదిలో పాపికొండలు పర్యటనకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సంఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటకుల భద్రతపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే.. విహార యాత్ర తాత్కాలికంగా నిలిపివేసి బోట్లను తనిఖీలు చేశారు.
{{/usCountry}}గోదావరి నది అందాలను, పాపికొండల ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల రద్దీ మళ్లీ పెరగనుంది. బోటు సర్వీసులు పునఃప్రారంభం కావడంతో అటు పర్యాటక రంగానికి, ఇటు స్థానిక వ్యాపారులకు ఊరట లభించింది.