ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా జాతికి అంకితం చేశారు. దీనితో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతికి ఊతమిచ్చే రూ.18,000 కోట్ల విలువైన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని అందరికీ నమస్కారం అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సింహాచలం అప్పన్న స్వామికి, విజయనగరం పైడితల్లి అమ్మవారికి శిరస్సు వంచి ప్రణామాలు సమర్పించారు.
ఏపీ ప్రగతిలో ఒక శుభదినమని, రూ.18,000 కోట్ల ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను వేగంగా మారుస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాదని, ఇది ఉత్తరాంధ్ర వికాసానికి కొత్త రన్వేగా, ఆంధ్రా యువత కలలకు లాంచ్పాడ్లా ఉపయోగపడుతుందని కొనియాడారు.
గతంలో విమానాశ్రయం నిర్మిస్తే ఒకే కుటుంబం పేర్లు పెట్టే సంస్కృతి ఉండేదని.. కానీ తమ ప్రభుత్వం అయోధ్యలో మహర్షి వాల్మీకి, పంజాబ్లో సంత్ రవిదాస్ పేర్లు పెట్టినట్లే, ఇక్కడ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో గౌరవించుకున్నామని మోదీ గుర్తుచేశారు.
2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. కానీ గడిచిన 12 ఏళ్లలో కొత్తగా 166 విమానాశ్రయాలను నిర్మించి మొత్తం సంఖ్యను భారీగా పెంచామన్నారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా తమ సొంత ప్రాంతాల నుంచే విమానం ఎక్కేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.
విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత రేవులను ఆధునీకరించడంతో పాటు, మూలపేట, రామాయపట్నంలో నూతన పోర్టులు నిర్మిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఏపీలో ప్రస్తుతం రూ. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోందని, గ్లోబల్ ఇన్వెస్టర్లు తరలివస్తున్నారని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర భవిష్యత్తు మార్చేస్తుంది : చంద్రబాబు
{{/usCountry}}విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత రేవులను ఆధునీకరించడంతో పాటు, మూలపేట, రామాయపట్నంలో నూతన పోర్టులు నిర్మిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఏపీలో ప్రస్తుతం రూ. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోందని, గ్లోబల్ ఇన్వెస్టర్లు తరలివస్తున్నారని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర భవిష్యత్తు మార్చేస్తుంది : చంద్రబాబు
{{/usCountry}}శంషాబాద్ విమానాశ్రయం తెలంగాణ అభివృద్ధి పథాన్ని మార్చినట్లే, భోగపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. "భోగపురం విమానాశ్రయానికి మా ప్రభుత్వమే శంకుస్థాపన చేసింది, ఇప్పుడు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించింది కూడా మా ప్రభుత్వమే" అని అన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ. 6.13 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక 5.57 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయని ఆయన చెప్పారు.
మోదీని విమర్శిస్తే బాధపడ్డా : పవన్ కళ్యాణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత దేశంలోని ప్రతి రంగంలో పరివర్తనను తీసుకువస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కష్టపడి పనిచేస్తున్న ప్రధానికి అనేక అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్లో మోదీని విమర్శిస్తుంటే బాధపడ్డానని తెలిపారు. దేశాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లడం ఎంత కష్టమో ఆలోచించాలన్నారు. తనను దూషించేవారిని క్షమించే గుణం మోదీది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు.