తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ ఆ తర్వాత హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసుల కాల్పులు చేసినట్టుగా తెలుస్తోంది.

కోనఉప్పలపాడులో ఏడేళ్ల బావమరిది వేంచంద్రను బావ సర్వేశ్కుమార్ కిడ్నాప్ చేశాడు. కుందనకోట గ్రామం వద్ద బాలుడిని గొంతు నులిమి, రాయితో కొట్టి కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలానికి వెళ్లిన సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడి బీర్ బాటిల్తో దాడి చేశాడు. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. చెత్త కుప్ప పక్కన ఉన్న బీర్ బాటిల్ తీసుకొని.. పోలీసులపై దాడికి దిగాడు సర్వేశ్. వెంటనే పోలీసులు అప్రమత్తయ్యారు. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడు సర్వేశ్ కుమార్.. మోకాళ్లపై సీఐ రామసుబ్బయ్య కాల్పులు జరిపారు. కాళ్ళకు బుల్లెట్లు తగిలి కింద పడి పోలీసులకు దొరికాడు నిందితుడు.
సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్కు గాయాలు అయ్యాయి. సర్వేశ్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోనకోనఉప్పలపాడులో వేంచేంద్ర అనే ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. బాలుడికి బావ అయ్యే వ్యక్తి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి.. కుందనకోటకొండలో చంపి పడేశాడు. వేంచేంద్ర అక్కను సర్వేశ్ వివాహం చేసుకున్నాడు.
ఒంటిపూట బడి కావడంత మధ్యాహ్నం స్కూల్ బస్సు డ్రైవర్ వేంచంద్రతోపాటుగా పిల్లలను తీసుకెళ్లి రోడ్డు పక్కన దింపి వచ్చాడు. వేంచంద్ర ఇంటికి వెళ్తున్న సమయంలో బాలుడి బావ సర్వేశ్ కలిశాడు. తినుబండారాలు ఇచ్చాడు. మాయ మాటలు చెప్పి.. తీసుకెళ్లిపోయాడు.
{{/usCountry}}ఒంటిపూట బడి కావడంత మధ్యాహ్నం స్కూల్ బస్సు డ్రైవర్ వేంచంద్రతోపాటుగా పిల్లలను తీసుకెళ్లి రోడ్డు పక్కన దింపి వచ్చాడు. వేంచంద్ర ఇంటికి వెళ్తున్న సమయంలో బాలుడి బావ సర్వేశ్ కలిశాడు. తినుబండారాలు ఇచ్చాడు. మాయ మాటలు చెప్పి.. తీసుకెళ్లిపోయాడు.
{{/usCountry}}బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించారు. ఓ వ్యక్తి ముసుగు ధరించి.. బైక్ మీద రావడం, ఉప్పలపాడులోని ఒక షాపు దగ్గర తినుబండారాలు కొనుగోలు చేయడం కనిపించింది. బలుడి స్కూల్ బస్సు రావడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సర్వేశ్ బాలుడిని తీసుకెళ్లి హత్య చేసినట్టుగా విచారణలో వెళ్లడైంది. ఇంట్లో గొడవలతో బాలుడిని సర్వేశ్ చంపేసినట్టుగా తెలుస్తోంది.