హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఈ ఘటనలో 20 మందికిపైగా మరణించారు. పలువురు గాయలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తమను ఈ ఘటన కలిచివేసిందని చెప్పారు.

కర్నూలులో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను కలిచి వేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి అందుతుంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్నందున అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.
తెలంగాణ హెల్ప్ లైన్ నెంబర్లు
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లాలని గద్వాల్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫోన్ నంబర్లు- 99129 19545, 94408 54433 తో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. ప్రమాదంలో మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.
{{/usCountry}}మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫోన్ నంబర్లు- 99129 19545, 94408 54433 తో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. ప్రమాదంలో మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు.
{{/usCountry}}