...
...
Next Story

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే.. ఇంటింటా సర్వే

రాజమహేంద్రవరం కల్తీ పాలన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. సహాయం, ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.

Published on: Feb 24, 2026, 09:25:50 IST
By , Rajamahendravaram
Prefer HTon Google
Advertisement

రాజమహేంద్రవరం కల్తీ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన

ఈ సందర్భంగా గ్రామంలో సమగ్రంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రక్రియను మరోసారి సమీక్షించారు. తాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటా సర్వే నిర్వహిస్తూ, లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 9494060060 ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు కలెక్టర్.

రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి, బాధితులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కిమ్స్, రెయిన్బో వంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంపూర్ణ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఘటనకు గల కారణాలను విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించారు. కల్తీ లేదా ఇతర లోపాలపై కఠిన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe