రేషన్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసింది. రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని ప్రకటించగా… కొత్తగా కార్డులు కావాల్సిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక పేర్ల మార్పుతో పాటు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇక రేషన్ కార్డ్ అప్లికేషన్లకు సంబంధించి సర్వీస్ ఛార్జ్ లను పెంచారు. దీంతో కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల కోసం ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగిన ఛార్జీలు - వివరాలు…
- మీసేవా, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల రేషన్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
- గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు ఇప్పుడు రూ.100కు పెరిగాయి.
- గతంలో రూ.48 సేవా రుసుముగా గల రైస్ కార్డ్ విభజన సర్వీస్ రూ.200కు పెరిగింది.
- కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తుతో పాటు డూప్లికేట్ కార్డు పొందటం, రేషన్ కార్డుల్లోని వివరాలు తప్పుగా ఉంటే సవరించుకోవడం వంటి సేవలకు ఛార్జీలు వర్తిస్తాయి.
- కొత్త సభ్యులను చేర్చడం, ఉన్న సభ్యులను తొలగించడం, అడ్రస్ మార్పు, రైస్ కార్డును విభజించడం వంటి అన్ని సేవలకు కూడా సర్వీస్ ఛార్జీలకు అమలవుతాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
{{/usCountry}}ఇక రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
{{/usCountry}}ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే..?
రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.