ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఊపిరాడకుండా చేస్తున్న ఉక్కపోత, తీవ్రమైన వడగాల్పులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి సీజన్లోనే అత్యధికంగా బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత భయం పుట్టిస్తోంది ఇప్పటికే 11 జిల్లాల్లో 45 డిగ్రీల మార్కును దాటగా.. 18 జిల్లాల పరిధిలోని దాదాపు 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
గురువారం అలర్ట్
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం గురువారం రాష్ట్రంలో ఎండలు మరింత ముదరనున్నాయి. సుమారు 74 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఎండలు 47 డిగ్రీల దాకా వెళ్లొచ్చు.
విజయనగరం, మార్కాపురం ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో 40 నుండి 43 డిగ్రీలు ఎండల ప్రభావం ఉంటుంది. శుక్ర, శనివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగానే ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వైద్యారోగ్య శాఖ అలర్ట్
రాష్ట్రంలో మండుతున్న ఎండలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి పెద్ద బోధనాసుపత్రుల వరకు అన్నిటా వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్యం అందించేలా సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1 నుంచి మే 19 వరకు రాష్ట్రంలో 325 వడదెబ్బ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఎండలను తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1.44 కోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది.
విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సూచన
{{/usCountry}}రాష్ట్రంలో మండుతున్న ఎండలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి పెద్ద బోధనాసుపత్రుల వరకు అన్నిటా వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్యం అందించేలా సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1 నుంచి మే 19 వరకు రాష్ట్రంలో 325 వడదెబ్బ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఎండలను తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1.44 కోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది.
విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సూచన
{{/usCountry}}రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత గరిష్ఠంగా ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.