వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ ప్రాంతాల మధ్య వన్-వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు అన్నీ స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను కలిగి ఉంటాయి. ఈ వన్-వే ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్, సర్వీసులు, స్టాప్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
విశాఖపట్నం-కాచిగూడ(ట్రైన్ నెం. 08521)

విశాఖపట్నం-కాచిగూడ ట్రైన్ 30.05.2026వ తేదీన విశాఖలో బయల్దేరుతుంది. విశాఖపట్నంలో సాయంత్రం 05:30 గంటలకు ప్యాసింజర్ బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది.
బిలాస్పూర్-పోడనూర్(ట్రైన్ నెం. 08201)
బిలాస్పూర్-పోడనూర్ ట్రైన్ 28.05.2026 తేదీన బిలాస్పూర్లో రాత్రి 09:10 గంటలకు బయలుదేరి, రెండో రోజు ఉదయం 09:45 గంటలకు పోడనూర్ చేరుకుంటుంది. ఈ రైలు రాయ్పూర్, దుర్గ్, గోందియా, బల్హర్షా, వరంగల్, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం, ఈరోడ్ మరియు తిరుప్పూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
దుర్గ్-ఎర్నాకులం(ట్రైన్ నెం. 08707)
దుర్గ్-ఎర్నాకులం ట్రైన్ 30.05.2026న ఉంది. దుర్గ్లో అర్ధరాత్రి 00:15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 02:00 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. గోందియా, బల్హర్షా, వరంగల్, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోడనూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలూవా స్టేషన్లలో ఈ రైలుకు స్టాపింగ్స్ ఉన్నాయి.
సమ్మర్ రష్ నేపథ్యంలో కన్ఫర్మ్డ్ టికెట్లు దొరకని ప్రయాణికులకు ఈ వన్-వే ప్రత్యేక రైళ్లు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ప్రయాణికులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ scr.indianrailways.gov.in ను సందర్శించవచ్చు.
జల్నా - తిరుపతి
{{/usCountry}}సమ్మర్ రష్ నేపథ్యంలో కన్ఫర్మ్డ్ టికెట్లు దొరకని ప్రయాణికులకు ఈ వన్-వే ప్రత్యేక రైళ్లు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ప్రయాణికులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ scr.indianrailways.gov.in ను సందర్శించవచ్చు.
జల్నా - తిరుపతి
{{/usCountry}}మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జల్నా నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 2026 జూన్ మొదటి వారం నుంచి జూన్ ఆఖరి వారం వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- రైలు నంబర్ 07814 (జల్నా - తిరుపతి) : ఈ ప్రత్యేక రైలు జూన్ 4, 2026 నుంచి జూన్ 25, 2026 వరకు ప్రతి వారం గురువారం నాడు జల్నా స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది.
- రైలు నంబర్ 07815 (తిరుపతి - జల్నా): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ 5, 2026 నుంచి జూన్ 26, 2026 వరకు ప్రతి వారం శుక్రవారం నాడు తిరుపతి నుండి జల్నాకు ప్రయాణికులను చేరవేస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
- ఆంధ్రప్రదేశ్: విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
- తెలంగాణ: బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం.
- మహారాష్ట్ర: పార్తూర్, సెలూ, పర్భణి, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్.