...
...
Next Story

Seasonal Guidelines : వేసవిలో పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి పాటించాల్సిన మార్గదర్శకాలు

Seasonal Guidelines : వేసవి వచ్చేసింది. ఈ సమయంలో పశువులను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అవి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వేసవిలో పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు చూద్దాం..

Published on: Apr 3, 2026, 10:18:37 IST
Advertisement

వేసవి కాలంలో పశువులను చూసుకోవాల్సిన విధానంపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతులు కాలానుగుణ మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులు, వేడి గాలులు పశువులపై ప్రభావం చూపుతాయని నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే సలహాలను జాగ్రత్తగా పాటించడం వల్ల పశువులు బాగుంటాయని, రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు.

మార్గదర్శకాలు

  • క్షేత్రస్థాయిలో అధికారులు రైతులతో మమేకం కావాలి. రైతులు ఉత్తమ పద్ధతులు పాటించేలా చూడాలి. పశువులకు రైతులు రోజంతా శుభ్రమైన నీటిని అందించాలి. సామూహిక నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి.
  • పశువుల జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి సహాయపడటానికి, పశుగ్రాసాన్ని చల్లని వేళల్లో ముక్కలుగా చేసి, 30-50 గ్రాముల ఖనిజ పోషక పదార్ధాలతో కలిపి అందించాలి.
  • అలాగే జంతువులను ఉదయం, సాయంత్రం మాత్రమే మేపాలి. వాటిని చల్లని, గాలి ప్రసరణ ఉండే షెడ్లలో ఉంచాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ సూచించారు.
  • పొద్దున్నే పాలు పిండటం వల్ల ఒత్తిడి తగ్గి, దిగుబడి మెరుగుపడుతుంది. షెడ్లు తూర్పు-పడమర దిశలో ఉండాలని, వాటి పైకప్పులపై నీళ్లు చల్లే సౌకర్యం ఉండాలని, అలాగే సంకర జాతి పశువులకు ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖ అన్నారు.
  • వేడి ఒత్తిడి లక్షణాలలో వేగంగా శ్వాస తీసుకోవడం, లాలాజలం కారడం, ఆకలి మందగించడం వంటివి ఉంటాయి. అప్పుడు రైతులు వెంటనే పశువులను చల్లబరచాలి, పశువైద్యులను సంప్రదించాలి. పశువుల రవాణాను చల్లని సమయాల్లో మాత్రమే పరిమితం చేయాలి. ప్రతి ఆరు గంటలకు ఒకసారి మేత పెట్టాలి.
  • పశువులకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలి. వీలైతే పక్షులకు కూడా నీరు అందించేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయండి.
  • వేసవి కాలంలో అవగాహన కార్యక్రమాలు, క్రమం తప్పకుండా పర్యటనలు చేపట్టాలని అధికారులను పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ పశువైద్య సేవలను ఉపయోగించుకోవాలని రైతులను కోరారు. అలాగే చల్లదనాన్ని కలిగించేందుకు షెడ్ల చుట్టూ తడి గోనె సంచులను కట్టాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe