...
...
Next Story

సికింద్రాబాద్ - విశాఖ వందే భారత్ ట్రైన్ అప్డేట్... ఆలస్యంగా బయల్దేరనున్న రైలు! రీషెడ్యూల్ టైమింగ్స్ ఇలా

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే కీలక సూచనలు చేసింది. ఇవాళ సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన రైలు వేళల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది.

Published on: Sep 12, 2026, 13:47:49 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సవరించిన వేళల ప్రకారం రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు బెంగళూరు నుంచి బయలుదేరే రెండు ప్రధాన రైళ్ల బయలుదేరే సమయాలను శనివారం (12-09-2026) రోజున రీషెడ్యూల్ చేశారు.

1. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ (ట్రెయిన్ నెం. 20834):

వందే భారత్ ఎక్స్ ప్రెస్
వందే భారత్ ఎక్స్ ప్రెస్

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సాధారణంగా మధ్యాహ్నం 15:00 గంటలకు (మధ్యాహ్నం 3:00 గంటలకు) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ…. సవరించిన వేళల ప్రకారం నేడు (12-09-2026) ఈ రైలు సాయంత్రం 17:45 గంటలకు (సాయంత్రం 5:45 గంటలకు) బయలుదేరుతుంది. అంటే నిర్ణీత సమయం కంటే దాదాపు 2 గంటల 45 నిమిషాలు ఆలస్యంగా ఈ రైలు పరుగులు తీయనుంది.

2. బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 18464):

బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ వేళల్లో కూడా స్వల్ప మార్పు జరిగింది. ఈ రైలు సాధారణంగా మధ్యాహ్నం 13:40 గంటలకు (మధ్యాహ్నం 1:40 గంటలకు) బెంగళూరు నుంచి బయలుదేరాల్సి ఉండగా, నేడు మధ్యాహ్నం 14:20 గంటలకు (మధ్యాహ్నం 2:20 గంటలకు) బయలుదేరుతుంది.

3. SMVT బెంగళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 12864):

ఎస్ఎమ్‌విటి బెంగళూరు నుంచి హౌరా వైపు వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో గణనీయమైన మార్పు వచ్చింది. శనివారం ఉదయం 10:40 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, సవరించిన షెడ్యూల్ ప్రకారం నేడు మధ్యాహ్నం 15:30 గంటలకు (మధ్యాహ్నం 3:30 గంటలకు) ఎస్ఎమ్‌విటి బెంగళూరు స్టేషన్ నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks