గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్.వి. నగర్లోని తన ఇంట్లో నేవీ అధికారి.. ప్రియురాలిని హత్య చేసిన విషయం తెలిసిందే. వివాహేతర సంబంధం కలిగిన మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ హత్య మార్చి 29న జరిగినప్పటికీ.. నిందితుడైన చింతడ రవీంద్ర(29) సోమవారం గాజువాక పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలిని నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతం, సంజీవయ్య కాలనీకి చెందిన పొలిపల్లి మౌనిక (31)గా గుర్తించారు.

రవీంద్ర, మౌనికలు 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (దక్షిణ ఉప-విభాగం) వై. శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. రవీంద్ర 2024లో వివాహం చేసుకున్నప్పటికీ.. మౌనికతో తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. రవీంద్ర భార్య ప్రసవం కోసం విజయనగరంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ సమయంలోనే రవీంద్ర ఈ హత్యకు పథకం రచించి ఉంటాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
తమ వివాహేతర సంబంధాన్ని బయటపెడతానని మౌనిక తనను బెదిరిస్తోందని రవీంద్ర పోలీసులకు తెలిపాడు. ఆదివారం ఉదయం మౌనికను రవీంద్ర తన ఫ్లాట్కు పిలిచాడు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన అనంతరం, మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో రవీంద్ర మౌనికను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో భాగంగా రవీంద్ర మృతదేహాన్ని ముక్కలుగా నరికి, అందులో కొంత భాగాన్ని తన ఇంట్లోని ఫ్రిజ్లో దాచాడు. తల, చేతులను అడవివరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టి, మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, కాళ్ళను సూట్ కేసులో పెట్టాడు రవీంద్ర. అలా మిగిలిన భాగాలను సంచిలో కుక్కాడు.
అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పేశాడు. అతని సూచనతో వేరే మార్గం లేక తమకు లొంగిపోయాడని తెలిపారు గాజువాక పోలీసులు. తన స్నేహితుడే రవీంద్ర కుటుంబ సభ్యులకు, భార్యకు విషయాన్ని చెప్పినట్లు తెలిపారు.
{{/usCountry}}అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పేశాడు. అతని సూచనతో వేరే మార్గం లేక తమకు లొంగిపోయాడని తెలిపారు గాజువాక పోలీసులు. తన స్నేహితుడే రవీంద్ర కుటుంబ సభ్యులకు, భార్యకు విషయాన్ని చెప్పినట్లు తెలిపారు.
{{/usCountry}}పోలీసులు ఫ్రిజ్లో దాచిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భాగాలను ఒక ట్రాలీ బ్యాగులో, గోనె సంచుల్లో కుక్కి ఉంచినట్లు గుర్తించారు. కాల్చివేసిన శరీర భాగాల అవశేషాలను పోలీసులు పరిశీలించారు. గాజువాక పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
ఇదిలా ఉండగా, మృతురాలి తల్లిదండ్రులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.
వీరి పరిచయానికి డేటింగ్ యాప్ ముఖ్యమైన కారణం. 2021లో డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం పెంచుకున్నాడు నేవీ అధికారి రవీంద్ర. 2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగించాడు.