...
...
Next Story

దక్షిణ మధ్య రైల్వేకు రూ.21,211.92 కోట్ల ఆదాయం.. జోన్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి

South Central Railway : దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్‌)జోన్‌ చరిత్రలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధిక ఆదాయాన్ని అర్జించింది. సరకు రవాణాతో రూ.13,835 కోట్లు, ప్రయాణికులతో 6,235 కోట్ల ఆదాయం సంపాదించింది.

Published on: Apr 2, 2026, 10:33:39 IST
Advertisement

దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.21,211.92 కోట్ల అత్యధిక ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.12 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ రికార్డు స్థాయి పనితీరు.. సరకు రవాణా, ప్రయాణికుల నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆదాయ పెరుగుదల దక్షిణ మధ్య రైల్వే ప్రాంతంపై సానుకూల ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే ఆదాయం

అధికారిక ప్రకటన ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే జోన్ 147.87 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రూ. 13,835.27 కోట్లు ఆర్జించింది. బలమైన సరకు రవాణా పనితీరుతో దక్షిణ, మధ్య భారతదేశం అంతటా పరిశ్రమలు, వాణిజ్యం, సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. ఇటువంటి వృద్ధి ప్రాంతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.

ప్రయాణికుల విభాగం నుంచి ఆకట్టుకునే లాభాలు వచ్చాయి. రూ. 6,235.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది దక్షిణ మధ్య రేల్వే. ఇది గత సంవత్సరం నమోదైన రూ. 5,714.83 కోట్ల ఆదాయం కంటే 9.11 శాతం పెరుగుదల. 286.44 మిలియన్ల ప్రయాణం చేశారు. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం 9.11 శాతం పెరిగింది.

దీనికి అదనంగా పార్శిళ్లు, టికెట్ తనిఖీ జరిమానాలు, కోచ్ బుకింగ్‌లతో సహా ఇతర మార్గాల నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ రూ.515.18 కోట్లు ఆర్జించింది. పార్కింగ్, క్యాటరింగ్, విశ్రాంతి గదులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల వంటి విభాగాల నుంచి మరో రూ.626.10 కోట్లు సమకూరాయి. సరకు రవాణా, ప్రయాణికుల ఆదరణ, ఇతర రాబడులలో స్థిరమైన వృద్ధి సౌత్ సెంట్రల్ రైల్వే నిలకడైన ఆర్థిక పనితీరుకు గణనీయంగా దోహదపడిందని అధికారులు తెలిపారు.

పెరిగిన ఆదాయాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునీకరణ ప్రాజెక్టులు, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలకు మద్దతునిస్తాయని, తద్వారా విస్తృత ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘనత సాధించినందుకు జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఉద్యోగులను ప్రశంసించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe