విజయవాడ-లింగంపల్లి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన వార్తను అందించింది. విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్(రైలు నంబర్లు 12795/12796) రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం పాటు ఆగేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ నూతన స్టాపేజ్ 2026 సెప్టెంబర్ 4వ తేదీ నుండి అమలులోకి రానుంది. ప్రాథమికంగా ఆరు నెలల కాలపరిమితికి గానూ ఈ ప్రయోగాత్మక స్టాపేజ్ను కేటాయించారు. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా దీనిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది.
రైలు నంబర్ 12795 (విజయవాడ – లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్) విజయవాడ నుంచి సాయంత్రం 05:30 గంటలకు బయలుదేరుతుంది. పిడుగురాళ్లకు రాత్రి 07:08కు వచ్చి 07:09 గంటలకు బయలుదేరుతుంది. మంగళగిరి, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లిలో ఆగుతుంది.
రైలు నంబర్ 12796 లింగంపల్లి నుంచి విజయవాడకు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ పిడుగురాళ్లకు ఉదయం 08:06లకు వస్తుంది. 08:07కు బయలుదేరుతుంది. పిడుగురాళ్ల ప్రాంత ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రయాణికుల స్పందన ఆధారంగా ఈ స్టాపేజ్ పెంపుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
గుంటూరు-వికారాబాద్ ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆ రద్దీని నియంత్రించేందుకు గుంటూరు-వికారాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
రైలు నంబరు 07227 (గుంటూరు – వికారాబాద్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 30న (ఆదివారం) రాత్రి 9:45 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 31, సోమవారం) ఉదయం 5:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
రైలు నంబరు 07228 (వికారాబాద్ – గుంటూరు) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 31న (సోమవారం) రాత్రి 10:00 గంటలకు వికారాబాద్లో బయలుదేరి, మరుసటి రోజు (సెప్టెంబర్ 1, మంగళవారం) ఉదయం 6:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
స్టాప్ల వివరాలు
{{/usCountry}}రైలు నంబరు 07228 (వికారాబాద్ – గుంటూరు) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 31న (సోమవారం) రాత్రి 10:00 గంటలకు వికారాబాద్లో బయలుదేరి, మరుసటి రోజు (సెప్టెంబర్ 1, మంగళవారం) ఉదయం 6:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
స్టాప్ల వివరాలు
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో పలు కీలకమైన స్టేషన్లలో ఆగుతాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లిలో స్టాప్లు ఉన్నాయి.