South Coast Railway Wood Pulp Transport : సరుకు రవాణా రంగంలో భారతీయ రైల్వే మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్నటివరకు రహదారి మార్గం (రోడ్డు మార్గం) ద్వారా సాగిన సరుకు రవాణాను తన వైపునకు తిప్పుకోవడంలో దక్షిణ కోస్తా రైల్వే సఫలీకృతమైంది.

విదేశాల నుంచి దిగుమతి అయ్యే చెక్క గుజ్జు (ఇంపార్టెడ్ వుడ్ పల్ప్) రవాణాను ఇకపై రోడ్డు మార్గానికి బదులుగా సంపూర్ణంగా రైలు మార్గానికి మళ్లించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్కు మొదటి 'బాస్ట్ రైక్' (BOST Rake) ద్వారా పల్ప్ సరుకును విజయవంతంగా లోడ్ చేసి పంపించారు.
దక్షిణ కోస్తా రైల్వే విజ్ఞప్తి మేరకు…. జూలై 2026లో రైల్వే బోర్డు సరుకుల టారిఫ్ విధానంలో కీలక సవరణలు చేసింది. వుడ్ పల్ప్ను 'గూడ్స్ టారిఫ్ క్లాస్-110' (Goods Tariff Class-110) కింద చేర్చారు. ఈ టారిఫ్ సవరణల వల్ల రోడ్డు రవాణాతో పోలిస్తే రైలు మార్గం ద్వారా సరుకు పంపడం వ్యాపారులకు ఎంతో ఆర్థికంగా, చౌకగా మారింది.
ప్రయోజనాలు:
• కాకినాడ (విజయవాడ డివిజన్ / దక్షిణ తీర రైల్వే) నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్ వరకు మొత్తం 1,061 కిలోమీటర్ల మేర ఈ సరుకు ప్రయాణిస్తుంది.
• ఒక్కో బాస్ట్ రైక్ ద్వారా రైల్వేకు సుమారు రూ. 40 లక్షల వరకు రవాణా ఛార్జీల (ఫ్రైట్) ఆదాయం సమకూరనుంది.
• ఈ కొత్త విధానం ద్వారా ఏడాదికి సుమారు 1.5 లక్షల టన్నుల అదనపు సరుకు రవాణా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}• ఈ కొత్త విధానం ద్వారా ఏడాదికి సుమారు 1.5 లక్షల టన్నుల అదనపు సరుకు రవాణా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}• కేవలం ఈ ఒక్క రూట్ ద్వారానే దక్షిణ కోస్తా రైల్వే ఖాతాలో ఏడాదికి రూ. 20 కోట్ల అదనపు ఆదాయం జమ కానుంది. సరుకు రవాణా వర్తకులను ఆకర్షించేందుకు రైల్వే శాఖ చేపడుతున్న ఇటువంటి మౌలిక సంస్కరణలు, సరుకు రవాణాదారులకు ఖర్చు తగ్గిస్తూనే, రైల్వే శాఖకు భారీ ఆదాయ మార్గాలను తెరిచిపెడుతున్నాయి.