రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి పశ్చిమ బెంగాల్లోని షాలిమార్, అలాగే కర్ణాటకలోని ఎస్ఎంవీటీ బెంగళూరు మార్గాల్లో ప్రత్యేక వారంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక రైళ్ల సమయాలు, సర్వీసుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం - షాలిమార్ - విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

రైలు నంబరు 08508 (విశాఖపట్నం – షాలిమార్) ప్రతి మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 3:00 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. జూలై 7 నుంచి సెప్టెంబర్ 29 వరకు మొత్తం 13 ట్రిప్పుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08507 (షాలిమార్ – విశాఖపట్నం) ప్రతి బుధవారం ఉదయం 5:00 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జూలై 8 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 13 ట్రిప్పులు నడుస్తుంది.
ప్రధాన స్టాప్లు: ఈ రైళ్లు సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్పూర్-కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్, సంత్రాగాచి స్టేషన్లలో ఆగుతాయి.
విశాఖపట్నం - ఎస్ఎంవిటి బెంగళూరు - విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు
రైలు నంబరు 08581 (విశాఖపట్నం – ఎస్ఎంవిటి బెంగళూరు) ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. జూలై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు మొత్తం 13 ట్రిప్పుల పాటు సేవలు అందిస్తుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08582(ఎస్ఎంవీటీ బెంగళూరు – విశాఖపట్నం) ప్రతి శనివారం మధ్యాహ్నం 3:50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు మొత్తం 13 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
{{/usCountry}}తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08582(ఎస్ఎంవీటీ బెంగళూరు – విశాఖపట్నం) ప్రతి శనివారం మధ్యాహ్నం 3:50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు మొత్తం 13 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
{{/usCountry}}ప్రధాన స్టాప్లు: ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో నిలుస్తాయి.
రాబోయే పండుగలు, సెలవుల సీజన్లో రద్దీని తగ్గించడానికి ఈ 13 వారాల ప్రత్యేక రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తుగా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.