శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే తాజాగా దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వస్తున్నారు. దేవస్థానం భక్తులకు సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

మల్లన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో నవంబర్ 7వ తేదీ దాకా సాధారణ భక్తులకు స్పర్శ దర్శనానికి రద్దు చేసింది దేవస్థానం. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి స్పర్శదర్శనం కోసం భారీగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. ఇంకోవైపు శివస్వాములు కూడా మాల తీసేందుకు వస్తున్నారు. దీంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అల్పాహారం, తాగునీరు, తదితర వసతులను కల్పిస్తున్నారు.
ఉచితంగా లడ్డూలు
మల్లన్న స్పర్శ దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని అందిస్తారు. స్పర్శ దర్శనం టికెట్పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.
ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను దొరుకుతాయి. టికెట్లు తీసుకున్న ఈ భక్తులు కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చు.
గత నవంబర్ నెలలోనే శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒకరోజు మల్లన్న స్పర్శ దర్శనం అవకాశం కల్పించాలని నిర్ణంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు కూడా బోర్డు ఆమోదం తెలపింది.













