AP SSC Exams : ఏపీ టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - హాల్టికెట్ పై QR కోడ్, ఇక ఈజీగా సెంటర్ కు చేరుకోవచ్చు
ఏపీ టెన్త్ హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ముద్రించిన క్యూఆర్ కోడ్ సాయంతో చాలా సులంభంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు.
ఈనెల 16 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయా విద్యార్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

స్కాన్ చేసి చెక్ చేసుకోవచ్చు…
పరీక్షా కేంద్రాలకు చేరుకునే విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా విద్యాశాఖ ఈ ఏడాది కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించింది. ఈ క్యూఆర్ కోడ్ ను మొబైల్ ఫోన్ తో స్కాన్ చేస్తే…. పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలి? ఎంత టైమ్ పడుతుందని వంటి వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఫలితంగా ఎగ్జామ్ సెంటర్ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులకు ఓ అంచనాకు రావొచ్చు.
పట్టణాలు, నగరాల్లో ఎక్కువ పరీక్ష కేంద్రాలు ఉండటంతో వీటిని వెతుక్కోవడానికి విద్యార్థులు ఇబ్బందిపడొద్దనే ఉద్దేశ్యంతో ఈ కొత్త ఈ విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్ సాయంతో… చాలా సులభంగా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవచ్చని సూచిస్తున్నారు.
హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ….
మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం ఉండనుంది. హాల్ టికెట్లను కండక్టర్లకు చూపిస్తే… ఫ్రీగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను నడిపాలని ఆర్టీసీ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు.
ఏపీ టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. పేపర్ వాల్యూయేషన్ ప్రారంభిస్తారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ప్రకటిస్తారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో పొందొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











