తిరుమలలో తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఓవరాక్షన్ చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సీరియస్ అయింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇంతకీ ఏమైందంటే.. తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు తమిళనాడు భక్తులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో వచ్చారు. దీనితో కాసేపు హల్చల్ చేశారు. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నా డీఎంకేకు సంబంధించి.. జయలలిత, పళని స్వామి, ఇతర నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీని తిరుమలకు తీసుకొచ్చారు. ఆలయం దగ్గరలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ.. వీడియో తీసుకున్నారు. ఫొటోలు దిగారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.
ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. 'తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫొటలతో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ను టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఆ బ్యానర్ను ప్రదర్శించమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ తెలియజేస్తోంది.' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
తిరుమల గురించి ప్రచారం అయ్యే నకిలీ వార్తలు, తప్పుదారి పట్టించే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం ఈ సందర్భంగా మరోసారి చెప్పింది. భక్తులు అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన టీటీడీ ప్లాట్ఫామ్లపై మాత్రమే ఆధారపడాలని విజ్ఞప్తి చేసింది.
ఈ ఫ్లెక్సీ అలిపిరి దగ్గర తనిఖీలు దాటి పైకి ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ.. వీడియోలు, ఫొటోలు తీసుకుంటుంటే.. భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర, మాఢ వీధుల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, గుర్తులు, జెండాలు.. ఏవీ ప్రదర్శన చేయకూడదు. టీటీడీ నిషేధం విధించింది.
తిరుమలలో రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేయకూడదని రూల్ ఉంది. శ్రీవారి ఆలయం, మాఢ వీధుల్లో రీల్స్ కూడా చేయకూడదు. ఈ మేరకు నిబంధనలు ఉన్నా.. పలువురు భక్తులు ఉల్లంఘిస్తున్నారు. ఇతర భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. భక్తులకు టీటీడీ రోజూ మైక్లో ఇలాంటివాటిపై అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదు.
{{/usCountry}}తిరుమలలో రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేయకూడదని రూల్ ఉంది. శ్రీవారి ఆలయం, మాఢ వీధుల్లో రీల్స్ కూడా చేయకూడదు. ఈ మేరకు నిబంధనలు ఉన్నా.. పలువురు భక్తులు ఉల్లంఘిస్తున్నారు. ఇతర భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. భక్తులకు టీటీడీ రోజూ మైక్లో ఇలాంటివాటిపై అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదు.
{{/usCountry}}