...
...
Next Story

ఏపీలో 2029 నాటికి 2 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. ప్రతి 30 కి.మీకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్!

కొత్త ప్రోత్సాహకాలతో ఆంధ్రప్రదేశ్ ఈవీ (EV) వినియోగాన్ని వేగవంతం చేస్తోందని రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. సబ్సిడీని వినియోగించుకోవాలని కోరారు.

Published on: Sep 10, 2026, 05:42:51 IST
Advertisement

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకే కాకుండా కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్
ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరలో 5 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రోత్సాహకం మార్చి 2027 వరకు వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో రిజిస్టరైన ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను నుంచి ఐదేళ్ల మినహాయింపు కల్పించడం ద్వారా ఈవీల వైపు మళ్లేలా ప్రజలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ పాయింట్లను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టుగా మంత్రి వెల్లడించారు. అందులో భాగంగానే.. మొదటి 5,000 ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఇన్‌స్టాలేషన్ ఖర్చులో 25 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించినట్టుగా చెప్పారు.

భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. ఆగస్టులో దేశవ్యాప్తంగా సుమారు 2.98 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. ఇది ఈ రంగానికి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమని చెప్పారు.

మొత్తం వాహన మార్కెట్‌లో ఈవీల వాటా 9.5 శాతం నుండి 12.3 శాతానికి పెరిగిందన్నారు మంత్రి రాంప్రసాద్. భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 2029 నాటికి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కనీసం 10,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 20,000 కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. అదే సమయంలో ప్రజా రవాణాలో ఈవీల వినియోగాన్ని కూడా విస్తరించాలని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks