కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు.

గజరాజులు ముందుగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
మోహినీ రూపంలో స్వామివారి దర్శనం జగత్తును ఆవరించిన మాయామోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. సర్వమూ భగవంతుని లీలావిలాసమేనని, భక్తి మార్గమే మాయామోహాల నుంచి విముక్తికి దారి చూపుతుందని ఈ అలంకారం చాటిచెబుతోంది.
పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన గరుడ వాహనసేవకు 108 వైష్ణవ దివ్యదేశాల్లో విశిష్ట స్థానం ఉంది. భగవంతుని వాహనమైన గరుడుని దర్శించడం ద్వారా భక్తిలో శరణాగతి, జ్ఞానం, వైరాగ్యం కలగాలని స్వామివారు అనుగ్రహిస్తున్నారనే విశ్వాసం ఉంది. గరుడుని దర్శనం సర్వపాపాలను హరిస్తుందని, భక్తులకు ఆధ్యాత్మిక శుభఫలాలను ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
స్వామి పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీ గరుడసేవ కారణంగా ఉదయం 3 గంటల నుండే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతిచ్చారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు భక్తులను పుష్కరిణిలో స్నానమాచరించేందుకు అనుమతిస్తారు. అయితే గరుడసేవ రోజున భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఉదయం 3 గంటల నుండే పుష్కరిణిని తెరిచి భక్తులను అనుమతించింది టీటీడీ.
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యం. వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని టీటీడీ స్పష్టం చేసింది. లడ్డూ తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందని తెలిపింది. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తామని వెల్లడించింది. అయితే కొందరు అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
{{/usCountry}}పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యం. వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని టీటీడీ స్పష్టం చేసింది. లడ్డూ తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందని తెలిపింది. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తామని వెల్లడించింది. అయితే కొందరు అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
{{/usCountry}}