Tirumala Srivari Brahmotsavam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ధ్వజారోహణ ఘట్టంలో ఉపయోగించే పవిత్రమైన దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయానికి శనివారం ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ఈనెల 15న ధ్వజారోహణం…

ఈ పవిత్రమైన దర్భ చాప, తాడును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉన్న శేషవాహనంపై భక్తిశ్రద్ధలతో ఉంచారు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6.21 గంటల నుండి 6.35 గంటల వరకు మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ శుభ ముహూర్తంలోనే ఈ దర్భ చాపను, తాడును వినియోగిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీ. రుత్వికులు వేద మంత్రోచ్ఛారణల నడుమ దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. అలాగే దర్భతో ప్రత్యేకంగా పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు.
దీని తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ దాదాపు 10 రోజుల ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉన్నప్పటికీ, తిరుమలలో కేవలం విష్ణు దర్భను మాత్రమే ఉపయోగిస్తారు.
ఈ పవిత్ర కార్యక్రమం కోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామం నుంచి టీటీడీ అటవీ సిబ్బంది ప్రత్యేకంగా విష్ణు దర్భను సేకరించారు. ఆ తర్వాత దీన్ని తిరుమలకు తీసుకువచ్చి, లేత ఎండలో వారం రోజుల పాటు ఎండబెట్టి, అత్యంత పరిశుభ్రంగా మార్చారు. అటవీశాఖ సిబ్బంది ఎంతో శ్రమించి 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 200 కిలోల బరువుండే దర్భ చాపను, అలాగే 250 మీటర్ల పొడవుతో 100 కిలోల బరువున్న తాడును సిద్ధం చేశారు.
దర్భ (కుశ గడ్డి) వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా స్థానం సంపాదించుకుంది. ఋగ్వేదం “కుశాః పవిత్రా భవతు” అంటూ దర్భను అత్యంత శుద్ధికరమైనదిగా అభివర్ణించింది. అలాగే యజుర్వేదం కూడా దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసనలు, జపాలు శ్రేష్ఠమైన ఫలితాలను ఇస్తాయని స్పష్టం చేసింది.
{{/usCountry}}దర్భ (కుశ గడ్డి) వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా స్థానం సంపాదించుకుంది. ఋగ్వేదం “కుశాః పవిత్రా భవతు” అంటూ దర్భను అత్యంత శుద్ధికరమైనదిగా అభివర్ణించింది. అలాగే యజుర్వేదం కూడా దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసనలు, జపాలు శ్రేష్ఠమైన ఫలితాలను ఇస్తాయని స్పష్టం చేసింది.
{{/usCountry}}శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే…. దర్భలో సిలికా పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు సూక్ష్మక్రిములను సంహరించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సనాతన వేదోక్త కర్మల్లో దర్భను ఉపయోగించడాన్ని ఒక దైవిక వరంగా భావిస్తారు.