టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టి.. ఏడాది అవుతున్న సందర్భంగా హైదరాబాద్లో బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజల్లో భక్తి భావన పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. తిరుపతి ఎయిర్పోర్టుకు శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్టుగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని వివరించారు. ఎయిర్పోర్టును ఆలయం సెట్ మాదిరిగానే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు.

'భక్తులకు ఇబ్బంది లేకుండా.. నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నాం. రోజు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది భక్తులు అన్న ప్రాసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కూడా మార్పులు వచ్చాయి. పది రోజులైనా నిల్వ ఉంటున్నాయి. ఈ విషయాన్ని భక్తులే చెబుతున్నారు. తిరుపతి లోకల్ వాళ్లకు నెలకోసారి తొలి మంగళవారం 3 వేల మందికి దర్శనం కల్పిస్తున్నాం.' అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
ఏఐ సాంకేతికత సాయంతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం ఏర్పాటు చేయాలని అనుకున్నామన్నారు. కొందరు ఏపై గురించి వ్యతిరేకత వ్యక్తం చేశారని, కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో మళ్లీ ఏఐ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తామన్నారు. తిరుమల కొండపై రాజకీయలు మాట్లాడితే చర్యలు తీసుకోవాలని తీర్మానించామన్నారు.
తిరుమలలో దాదాపు 1500 దుకాణాలకు ఇష్టా రాజ్యంగా అనుమతులు ఇచ్చారని, వాటిని క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. బ్రేక్ దర్శనలు మెున్నటిదాకా 10.30కి ఉండేవని, ఇప్పుడు వాటిని తెల్లవారుజామునకు మార్చామన్నారు. అలిపిరి టోల్గేట్ వద్ద కొత్త సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తామని కేంద్రమంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారని, వాటిని తిరుపతి, తిరుమల మధ్య నడిపేందుకు నిర్ణయించామన్నారు. టీటీడీ పరిధిలో ఉండే ఆలయాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించారు.
'తెలంగాణలో దుబ్బాక, కరీంనగర్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నాం. ఒంటిమిట్టలో వంద గదుల వసతి గృహం నిర్మాణం చేయాలి. కాణిపాకం ఆలయం దగ్గర రూ.25 కోట్లతో భవనాల నిర్మాణం, తలకోనలో రూ.19 కోట్లతో ఆలయం అభివృద్ధి చేపడుతున్నాం.' అని టీడీడీ ఛైర్మన్ తెలిపారు.
{{/usCountry}}'తెలంగాణలో దుబ్బాక, కరీంనగర్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నాం. ఒంటిమిట్టలో వంద గదుల వసతి గృహం నిర్మాణం చేయాలి. కాణిపాకం ఆలయం దగ్గర రూ.25 కోట్లతో భవనాల నిర్మాణం, తలకోనలో రూ.19 కోట్లతో ఆలయం అభివృద్ధి చేపడుతున్నాం.' అని టీడీడీ ఛైర్మన్ తెలిపారు.
{{/usCountry}}