జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం
National Sanskrit University Admissions : ఏపీలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభించింది. వైస్ ఛాన్సలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి వేసవి శిబిరాల గురించి కూడా వివరించారు.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2026-27 సంవత్సరానికిగానూ అడ్మిషన్స్ ప్రక్రియ మెుదలైంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పరిపాలన మండలి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (NSU) వైస్ ఛాన్సలర్ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూజీ, పీజీ ప్రవేశాల ప్రకటనను విడుదల చేశారు.

ఈ సమావేశంలో ఆయన 'స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్' గురించి, అలాగే యోగా, అబాకస్, వేద గణిత వేసవి శిబిరాల గురించి వివరించారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను Prak-Shastri(ఇంటర్మీడియట్), యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల ప్రకటనకు సంబంధించి విశ్వవిద్యాలయం ఒక బ్రోచర్ను విడుదల చేసిందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీని సంస్కృత మాధ్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకుని, ఈ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.
మరోవైపు పిల్లలు, పెద్దలు, వృద్ధులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం మే 4వ తేదీ నుండి విశ్వవిద్యాలయంలో యోగా వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. యోగా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి యోగా మందిరంలో తరగతులు ఉంటాయి. యోగా శిబిరంలో చేరాలనుకునే వారు నమోదు చేసుకుని, ఈ తరగతులకు హాజరుకావచ్చు.
విశ్వవిద్యాలయంలో కొత్తగా 'స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్' ప్రారంభించబడుతోందని కూడా వైస్ ఛాన్సలర్ తెలియజేశారు. సంస్కృతంతో పాటు కంప్యూటర్ సైన్స్, గణితం, చరిత్ర, ఆంగ్లం, హిందీ, తెలుగు, భాషా సాంకేతికత (Language Technology) వంటి ఇతర సబ్జెక్టులలో కూడా విశ్వవిద్యాలయం తరగతులను అందిస్తుంది. సంస్కృతాన్ని ప్రధానాంశంగా కలిగిన యూజీ, పీజీ కోర్సులు త్వరలోనే ప్రారంభిస్తామని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://nsktu.ac.in/ సందర్శించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


