ఫైన్ లేకుండా ఏపీ సెట్ దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డే.. ఇదిగో మీకోసం డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది

ఏపీ సెట్ 2025 రిజిస్ట్రేషన్ ఈరోజు(ఫిబ్రవరి 9)తో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ ఉంది.

Updated on: Feb 09, 2026 11:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET) 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 9తో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు apset.net.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రూ.2000 ఆలస్య రుసుము ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2026గా నిర్ణయించారు.

ఏపీ సెట్ 2025
ఏపీ సెట్ 2025

హాల్ టికెట్ మార్చి 19, 2026 నుండి డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత పూర్తి చేసి ఉండాలి. 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

  • AP SET అధికారిక వెబ్‌సైట్‌ apset.net.in సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP SET 2025 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్ నింపండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేయండి, మీ దరఖాస్తు సబ్మిట్ అవుతుంది.
  • ఆ తర్వాత పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి, తదుపరి అవసరం కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోండి.

దరఖాస్తు ఫీజు

ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1600, బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ-సీ, బీసీ-డీ, బీసీ-ఇ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ. 900. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి.

పరీక్ష తేదీలు

2026 మార్చి 28, 29 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఏపీ సెట్ నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ లేదా పెన్-అండ్-పేపర్ మోడ్ అనుమతించరు. పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ ఉంటాయి. 100 ప్రశ్నలకు 200 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలుగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఏపీ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.

AP SET 2025 కోసం నమోదు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్