రాయలసీమలో భారీగా టమోటా ధరలు పతనం.. కేజీ ధర కేవలం రూ.8 మాత్రమే!
రాయలసీమలో టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. మార్కెట్లలోకి భారీగా టమోటా వస్తుండటంతో ధరలు పడిపోయాయి.
రాయలసీమ ప్రాంతంలో టమోటా ధరలు బాగా పడిపోయాయి. రైతులపై తీవ్ర ప్రభావం పడింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో బాగా టమోటా పంటలు పండడంతో మార్కెట్లలోకి ఉత్పత్తులు ఎక్కువగా వస్తున్న కారణంగా ధరలు బాగా పడిపోయాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.8 వరకు అమ్ముడవుతున్నాయి.

రిటైల్ ధరలు కూడా కిలోకు రూ.8 నుంచి రూ. 10కి పడిపోయాయి. గతంలో కిలోకు రూ.40కి టమోటాలు అమ్మే సూపర్ మార్కెట్లు.. ఇప్పుడు ధరలను కిలోకు రూ.15కి తగ్గించాయి. ఈ కారణంగా సాగు ఖర్చులను తిరిగి పొందలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గిట్టుబాటు ధరలు రావడం లేదు, గత మూడు సంవత్సరాలుగా, పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలోనే టమోటా ధరలు పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆస్పరి, బిల్లేకల్లు, దేవనకొండ, వీరుపాపురం ప్రాంతాల్లో టమాట సాగు విస్తారంగా సాగుతోంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, బద్వేల్, పులివెందుల మండలాల్లో ఈ పంటను విరివిగా పండిస్తారు. కర్నూలు జిల్లాలోనే దాదాపు 4,800 హెక్టార్లలో టమోటాలు పండిస్తున్నారు. దాదాపు 1.6 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ధరల క్షీణతతో ఈ సీజన్లో నష్టాలు పెరుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
మార్కెట్కు టమోటాలు ఎక్కువగా వచ్చినప్పుడు ధరలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం, మార్కెట్కు అసాధారణంగా పెద్ద మొత్తంలో టమోటాలు వచ్చాయన్నారు. మరోవైపు ప్రస్తుతం వస్తున్న సరుకు నాణ్యంగా లేదని కొందరు వ్యాపారులు అంటున్నారు. మెుదట్లో వచ్చినంత నాణ్యత లేక సరకును తిరస్కరిస్తున్నారు.
ఇక టమాటాకు ధర అంతగా లేకపోవడంతో ఇటీవల సాగు చేసిన రైతులు సైతం పంట కోత చేపట్టకుండా ఆగుతున్నారు. ఎక్కువగా పెట్టుబడులు పెట్టి సాగు చేశారు. దీంతో ఖర్చులు కూడా చేతికిరాని పరిస్థితి నెలకొన్నది. కనీసం కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


