తిరుమలకు సరకు రవాణాను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కార్గో లేన్ను నిర్మించే ప్రణాళిక ఉంది. ఈ మేరకు అలిపిరి టోల్ గేట్ భారీ ఆధునీకరణ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆమోదం తెలిపింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం.. కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి అత్యంత రద్దీగా ఉండే ప్రవేశ మార్గాలలో ఒకదాని వద్ద రద్దీని తగ్గించడం, భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపట్టిన చర్యలో ఒక భాగంగా అధికారులు పేర్కొంటున్నారు.

పునఃరూపకల్పన చేసే అలిపిరి చెక్ పోస్ట్లో 11 లేన్లు ఉంటాయని, వాటిలో మొదటి రెండు లేన్లు ప్రత్యేకంగా సరుకు రవాణా వాహనాల కోసం కేటాయించబడతాయని అధికారులు ధృవీకరించారు. మిగిలిన లేన్లు సాధారణ వాహనాల రాకపోకలకు ఉపయోగపడతాయి. తద్వారా యాత్రికులకు సులభమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజుకు సగటున 10,000 వాహనాలను నిర్వహిస్తున్న అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఈ ఆధునీకరణ వలన రద్దీ గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన రథ సప్తమి ఉత్సవం వంటి రద్దీ సమయాల్లో ఈ చెక్ పోస్ట్ వద్ద ఒక్క రోజులోనే గరిష్టంగా 14,830 వాహనాలు నమోదయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1 కిలోమీటరు కార్గో లేన్ ఆలస్యాన్ని తగ్గిస్తుందని, వాహనాలు ఒక దగ్గర ఆగిపోవడం వల్ల కలిగే గందరగోళాన్ని నివారిస్తుందని, అలాగే సరుకులు, ప్రయాణికుల తనిఖీని మరింత సమర్థవంతంగా చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఆమోదం పొందిన డిజైన్లు భవిష్యత్తులో మరో రెండు లేన్లను జోడించేందుకు కూడా వీలు కల్పిస్తున్నాయి. ఇది ట్రాఫిక్ నిర్వహణపై పరిపాలన దీర్ఘకాలిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. భూదేవి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రస్తుత కార్గో స్కానర్లను ఇప్పుడు అలిపిరికి తరలించి, కొత్త వ్యవస్థలో సరకు రవాణా తనిఖీలను ఏకీకృతం చేయనున్నారు.
ప్రతిపాదిత కార్గో లేన్ ప్రస్తుత చెక్ పోస్ట్కు సుమారు 650 మీటర్ల ముందు ఉన్న వినాయక ఆలయం వరకు విస్తరిస్తుంది. కార్గో లేన్ పూర్తయిన తర్వాత చెక్ పోస్ట్ పూర్తి ఆధునీకరణ చేపట్టనున్నట్టుగా అధికారులు చెప్పారు. అప్గ్రేడ్లో భాగంగా అధునాతన స్క్రీనింగ్ పరికరాలను సేకరిస్తున్నారు. వీటిలో డోర్-ఫ్రేమ్డ్ మెటల్ డిటెక్టర్లు, వాహన స్కానర్లు, మానవ స్కానర్లు, లగేజీ స్కానర్లు ఉన్నాయి. ఇప్పటికే మూడు ప్రయోగాత్మకంగా అమర్చారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మరో మూడు DFMDలు, రెండు అదనపు మెటల్ డిటెక్టర్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
{{/usCountry}}ప్రతిపాదిత కార్గో లేన్ ప్రస్తుత చెక్ పోస్ట్కు సుమారు 650 మీటర్ల ముందు ఉన్న వినాయక ఆలయం వరకు విస్తరిస్తుంది. కార్గో లేన్ పూర్తయిన తర్వాత చెక్ పోస్ట్ పూర్తి ఆధునీకరణ చేపట్టనున్నట్టుగా అధికారులు చెప్పారు. అప్గ్రేడ్లో భాగంగా అధునాతన స్క్రీనింగ్ పరికరాలను సేకరిస్తున్నారు. వీటిలో డోర్-ఫ్రేమ్డ్ మెటల్ డిటెక్టర్లు, వాహన స్కానర్లు, మానవ స్కానర్లు, లగేజీ స్కానర్లు ఉన్నాయి. ఇప్పటికే మూడు ప్రయోగాత్మకంగా అమర్చారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మరో మూడు DFMDలు, రెండు అదనపు మెటల్ డిటెక్టర్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
{{/usCountry}}మే నెల నాటికి లగేజీ స్కానర్లను సేకరించనున్నారు. వాహనాల్లో కూర్చున్న యాత్రికులను తనిఖీ చేయడానికి వాహన స్కానర్లు, “గ్రీన్ స్కానర్ల” సరఫరా కోసం టీటీడీ తన అధికారిక వెబ్సైట్లో టెండర్లను ఆహ్వానించి, ఆసక్తి వ్యక్తీకరణలను కూడా కోరింది.