డిసెంబర్ 30 నుంచి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ - టీటీడీ ఈవో

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌ ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారు.

Published on: Dec 05, 2025 6:06 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఉద‌యం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై ఈవో భ‌క్తుల‌కు వివ‌రించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 30 నుండి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని ప్రకటించారు.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

టీటీడీ ఈవో వెల్లడించిన ముఖ్యమైన అంశాలు:

  • డిసెంబర్ 30 నుండి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
  • ఈ పది రోజులకు గానూ 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు ఉంటాయి.
  • పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయింపు.
  • డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ.
  • న‌వంబ‌ర్ 27 నుండి డిసెంబ‌ర్ 1వ తేది వ‌ర‌కు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.
  • డిసెంబర్ 02వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయించారు.
  • మొదటి మూడు రోజులు S.E.D., శ్రీవాణి దర్శనాలు రద్దవుతాయి. మిగిలిన 7 రోజులకుగాను ఈరోజు (5వ తేదీ )ఉదయం 10 గం.లకు శ్రీవాణి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గం.లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం.
  • ఈ 10 రోజులలో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు.
  • స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం ఉంటుంది.
  • జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం ఉంటుంది.