తిరుమల తిరుపతి దేవస్థాన నుంచి మరో టెండర్ ప్రక్రియకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఆసక్తిగలవారు ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు సంబంధించి ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుంచి ఈ టెండర్లు ఆహ్వానిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుండి ఈ-టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లో పాల్గొనదలచిన వారు ఈ-కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.75,000/- (EMD) చెల్లించి తమ దరఖాస్తులను ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.
పూర్తి వివరాలకు www.tirumala.org, www.konugolu.ap.gov.inవెబ్సైట్లలో గానీ, కార్యాలయ సమయాల్లో తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం) ఫోన్ నెంబర్ 0877- 2264429లో గానీ సంప్రదించాలి.
జూలై నెల కోటా విడుదల
2026 జూలై నెలకు సంబంధించి టీటీడీ దర్శన కోటా గురించి అప్డేట్ వచ్చింది. విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
- ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
- వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
- అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
- శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
- వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
{{/usCountry}}తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
{{/usCountry}}