తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని ప్రముఖ ఆసుపత్రులకు మెడిసిన్, వైద్య పరికరాలు, ఇతర సరుకులను సరఫరా చేసే సంస్థలకు టీటీడీ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. టెండర్లలో పాల్గొనే కంపెనీలకు నిర్దేశించిన కనీస వార్షిక విక్రయాల నిబంధనను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల వేలంలో పాల్గొనే సంస్థల సంఖ్య తగ్గిపోతోందని భావించిన పాలకమండలి, జూలై 14న జరిగిన సమావేశంలో ‘రిజల్యూషన్ నంబర్ 134’ ద్వారా ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.
తిరుపతిలోని టీటీడీ నిర్వహించే మూడు ప్రధాన సూపర్స్పెషాలిటీ ఆసుపత్రులకు కావలసిన మందులు, ఇంజెక్షన్లు, ల్యాబ్ పరికరాలు, సర్జికల్ వస్తువులు, రేడియాలజీ విభాగం సామాగ్రి, బ్లడ్ బ్యాంక్ ఉత్పత్తులు, ఇతర వైద్య సరకుల కొనుగోలుకు ఈ కొత్త సడలింపులు వర్తిస్తాయి.
బర్డ్ (BIRRD) - బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ది డిజేబుల్డ్
స్విమ్స్ (SVIMS) - శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ (SPCHC)
గతంలో ఉన్న టెండర్ నిబంధనల ప్రకారం ఔషధ తయారీదారులు, పంపిణీదారులు, దిగుమతిదారులు పాల్గొనాలంటే వార్షిక టర్నోవర్ కనీసం రూ. 100 కోట్లు ఉండాలనే నిబంధన ఉండేది. టర్నోవర్ పరిమితి ఎక్కువగా ఉండటం వల్ల అర్హత కలిగిన అనేక కంపెనీలు టెండర్లలో పాల్గొనలేకపోయేవి. దీనివల్ల పోటీ తగ్గి, కొనుగోలు ప్రక్రియ మందగించేది.
ఈ సమస్యను పరిష్కరించడానికి జూలై 2న బర్డ్ డైరెక్టర్ అధ్యక్షతన టీటీడీ ఒక ప్రత్యేక కమిటీని పునర్వ్యవస్థీకరించింది. ఈ కమిటీ జూలై 3న సమావేశమై టర్నోవర్ పరిమితిని తగ్గించాలని స్పష్టమైన నివేదిక ఇచ్చింది. టెండర్ నిబంధనలను సడలించడం వల్ల ఎక్కువ సంఖ్యలో కంపెనీలు పాల్గొంటాయని, పోటీ పెరిగి నాణ్యమైన మందులు తక్కువ ధరలకే లభిస్తాయని, అంతేకాకుండా ఆసుపత్రులకు నిరంతరాయంగా మందుల సరఫరా జరుగుతుందని కమిటీ పేర్కొంది.
{{/usCountry}}ఈ సమస్యను పరిష్కరించడానికి జూలై 2న బర్డ్ డైరెక్టర్ అధ్యక్షతన టీటీడీ ఒక ప్రత్యేక కమిటీని పునర్వ్యవస్థీకరించింది. ఈ కమిటీ జూలై 3న సమావేశమై టర్నోవర్ పరిమితిని తగ్గించాలని స్పష్టమైన నివేదిక ఇచ్చింది. టెండర్ నిబంధనలను సడలించడం వల్ల ఎక్కువ సంఖ్యలో కంపెనీలు పాల్గొంటాయని, పోటీ పెరిగి నాణ్యమైన మందులు తక్కువ ధరలకే లభిస్తాయని, అంతేకాకుండా ఆసుపత్రులకు నిరంతరాయంగా మందుల సరఫరా జరుగుతుందని కమిటీ పేర్కొంది.
{{/usCountry}}ఏదేని కారణం వల్ల అత్యల్ప ధర కోట్ చేసిన ఎల్1 (L1) బిడ్డర్ మందులు సరఫరా చేయడంలో విఫలమైతే... ఎల్1 నిర్దేశించిన ధరలకే సరుకులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఎల్2 (L2), ఎల్3 (L3) బిడ్డర్ల నుంచి కొనుగోలు చేసే 'మల్టీ-వెండర్' విధానాన్ని కొనసాగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఆసుపత్రులలోకి మందులు, సర్జికల్ వస్తువులను స్వీకరించే ముందు వాటి నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి ప్రతీ ఆసుపత్రిలోనూ ఒక "క్వాలిటీ అసెస్మెంట్ కమిటీ" ని ఏర్పాటు చేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.