TTD Lord Venkateswara temple in Assam : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించాలనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పం వేగంగా సాకారం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం, సూచనల మేరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా ఈశాన్య భారత గేట్వేగా పిలిచే అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారులు మంగళవారం అధికారికంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కామ్రూప్ జిల్లాలో వేంకటేశ్వరుడి ఆలయం

అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన సోనాపూర్ సర్కిల్ పరిధిలో ఈ చారిత్రాత్మక భూమి కేటాయింపు జరిగింది. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంతంలో శ్రీనివాసుడికి సర్వాంగ సుందరమైన ఆలయాన్ని టీటీడీ నిర్మించనుంది.
గతంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు దేవస్థాన ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక ప్రక్రియలను వేగవంతం చేశారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ పాలకమండలి కూడా అస్సాం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖలు రాసి స్థల కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపారు.
ఇరు రాష్ట్రాల సమన్వయంతో సాగిన ఈ ప్రక్రియ మంగళవారం తుది ఘట్టానికి చేరుకుంది. అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ చేతుల మీదుగా టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ, ఈఈ శ్రీ సురేంద్ర రెడ్డిలకు భూమి స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ పత్రాల స్వీకరణతో సదరు భూమిపై టీటీడీకి పూర్తి స్థాయి చట్టపరమైన హక్కులు లభించాయి.
త్వరలోనే భూమిపూజ..
గౌహతి నగరానికి సమీపంలో నిర్మించబోయే ఈ శ్రీవారి ఆలయానికి త్వరలోనే శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఈ కీలక ఘట్టం ఎలాంటి అడ్డంకులు లేకుండా సఫలమైందన్నారు.
{{/usCountry}}గౌహతి నగరానికి సమీపంలో నిర్మించబోయే ఈ శ్రీవారి ఆలయానికి త్వరలోనే శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఈ కీలక ఘట్టం ఎలాంటి అడ్డంకులు లేకుండా సఫలమైందన్నారు.
{{/usCountry}}అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం అనేది ఈశాన్య భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మహత్తర కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.