కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక అప్డేట్ ఇచ్చింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్లైన్ కోటా విడుదల తేదీల షెడ్యూల్ను టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే భక్తులు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఏ రోజు ఏ కోటా విడుదలవుతుందో క్షుణ్ణంగా తెలుసుకోవడం ముఖ్యం. పూర్తి షెడ్యూల్, సమయాల వివరాలు ఇక్కడ చూడండి.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ షెడ్యూల్
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్జిత సేవల టికెట్ల కోటాను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తుల జాబితాను జూన్ 20న విడుదల చేస్తారు. లక్కీ డిప్లో పేరు వచ్చిన వారు జూన్ 20 నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్ డబ్బులు చెల్లించి తమ బుకింగ్ను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల కోటా
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్ట్, వృద్ధుల కోటా
సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా
{{/usCountry}}సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా
{{/usCountry}}భక్తులు ఎంతగానో ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల కానుంది. తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.