తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్దార్లకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 15వ తేదీ నుంచే ప్రారంభం కాగా… ఈ 24 వరకు అవకాశం ఉంటుంది.
టైమింగ్స్ వివరాలు….

తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 05.00 గం.ల వరకు వీటిని తీసుకోవచ్చు. అయితే తీసుకునే వాళ్లు టీటీడీ స్మార్ట్ ఐడీ కార్డులతో ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ సూచించింది. పింఛన్దార్లు / వారి కుటుంబ పింఛన్ దారులు / సీపీఎస్ వారికి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ అందజేస్తారు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. అక్టోబర్ 15 మరియు 16 తేదీలలో 164 నుండి 5,500 వరకు, అక్టోబర్ 17వ తేదీన 5,501 నుండి 7,000 వరకు పంపిణీ చేస్తారు. ఇక అక్టోబర్ 18న 7,001 నుండి 8,500, అక్టోబర్ 22న 8,501 నుండి 10,000 వరకు, అక్టోబర్ 23వ తేదీన 10,000 నుండి 12,500 వరకు, అక్టోబర్ 24వ తేదీన 12,500 నుండి మిగిలిన పిపిఓ నెంబర్ల వారికి ప్రసాదాలు అందిస్తారు. విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ కోరింది.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
{{/usCountry}}దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
{{/usCountry}}