దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ఆధ్యాత్మిక యాత్రికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. విజయవాడ మీదుగా రెండు భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు వేర్వేరు తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ సర్వీసులను ఆపరేట్ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
మొదటి రైలు షెడ్యూల్ వివరాలు :

తొలి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటలకు ఇందౌర్లో బయల్దేరుతుంది. ఆ తర్వాత వివిధ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ…. మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు బలార్షా చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి 11వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు విజయవాడకు…. అదే రోజు రాత్రి 11.00 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణికులను తీసుకుని 14వ తేదీ ఉదయం 7.00 గంటలకు ప్రముఖ శైవక్షేత్రం రామేశ్వరం చేరుకుంటుంది.
రెండో రైలు షెడ్యూల్ వివరాలు
మరో భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీన కుదాల్నగర్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రైలు 19వ తేదీ అర్ధరాత్రి 2.00 గంటలకు గూడూరు జంక్షన్ చేరుకుంటుంది. అనంతరం అదే రోజు రాత్రి 2.30 గంటలకు నెల్లూరు….. తెల్లవారుజామున 4.00 గంటలకు ఒంగోలు, 4.45 గంటలకు చీరాల స్టేషన్లకు వస్తుంది.
ఉదయం 7.00 గంటలకు విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.00 గంటలకు వరంగల్ కు చేరుకుటుంది. సాయంత్రం 5.00 గంటలకు బలార్షా మీదుగా ప్రయాణిస్తుంది. చివరగా ఈ రైలు 22వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమ్నాథ్కు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే భక్తులు, పర్యాటకులు భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. టికెట్లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. వేసవి, పండుగల సీజన్లలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే భక్తులు, పర్యాటకులు భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. టికెట్లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. వేసవి, పండుగల సీజన్లలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి.
{{/usCountry}}