...
...
Next Story

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌తో ఇద్దరు మృతి.. ఎనిమిది యాక్టివ్ కేసులు

Covid-19 Cases Andhra : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కోవిడ్ భయం పట్టుకుంది. కరోనాతో ఇద్దరు మరణించారు, అంతేకాదు ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Published on: Jul 12, 2026, 14:36:41 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో గత కొన్ని వారాల్లో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు రోగులు మరణించారు. దీంతో కోవిడ్ 19 భయం మళ్లీ పట్టుకుంది. దీంతో ఆరోగ్య అధికారులు నిఘా, సన్నద్ధతా చర్యలను ముమ్మరం చేశారు.

ఏపీలో కోవిడ్-18
ఏపీలో కోవిడ్-18

కడపలోని రాజంపేట ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి జ్వరం, దగ్గు రావడంతో కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతను వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో కేసులో ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన కడపకు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలగా, అనంతరం కోవిడ్-19 ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

కడప వైద్య కళాశాలకు చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అతను ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఆరోగ్య శాఖ జిల్లాకు స్పెషల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ బృందాలను పంపింది. ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 40 మంది నుంచి అధికారులు నమూనాలను సేకరించారు. వీటిలో 18 నమూనాలకు నెగటివ్ అని తేలగా, మిగిలిన పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

కడప జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది క్రియాశీలక కోవిడ్-19 కేసులు ఉన్నాయని జిల్లా ఆరోగ్య అధికారులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో తెలిపారు. వైరస్ వేరియంట్‌ను గుర్తించి, దాని వ్యాప్తి తీరును అర్థం చేసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పూణేలోని ఒక ప్రయోగశాలకు పంపారు. కడపలో మరింత వ్యాప్తి చెందకుండా నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి రవి బాబులతో కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్-19 మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది.

ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య చర్యలను ముమ్మరం చేశారు. శుభ్రపరిచే, బ్లీచింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే పరీక్షలు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాజిటివ్‌గా తేలిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించగా, మిగిలిన వారిని గృహ నిర్బంధంలో ఉంచి పర్యవేక్షించాలి.

కడపలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, రాష్ట్ర ఆరోగ్య అధికారులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోవిడ్-19 సన్నద్ధతా హెచ్చరికను జారీ చేశారు. నిఘా, పరీక్షలు, రిపోర్టింగ్ సిస్టమ్, అంటువ్యాధి నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని జిల్లా యంత్రాంగాలను కోరారు.

తగినన్ని పడకలు, వైద్య సహాయంతో ఐసోలేషన్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని ఆసుపత్రులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రజలు భయపడవద్దని, కానీ అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, కోవిడ్ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe