కుప్పం నియోజకవర్గ ప్రయాణికులకు గుడ్న్యూస్. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైన కుప్పం రైల్వే స్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్లను ప్రయోగాత్మకంగా కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 21న వాస్కో నుండి బయలుదేరే రైలు నెంబర్ 17315 వాస్కో డా గామా-వేళాంకన్ని వీక్లీ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 12:33 గంటలకు కుప్పం చేరుకుని 12:35 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 22న వేళాంకన్ని నుండి బయలుదేరే రైలు నెంబర్ 17316 వేళాంకన్ని-వాస్కో డా గామా వీక్లీ ఎక్స్ప్రెస్ ఉదయం 9:33 గంటలకు కుప్పం చేరుకుని 9:35 గంటలకు బయలుదేరుతుంది.
అదేవిధంగా సెప్టెంబర్ 20న బయలుదేరే రైలు నం. 11005 దాదర్-పుదుచ్చేరి ట్రై-వీక్లీ ఎక్స్ప్రెస్ రాత్రి 10:45 గంటలకు వచ్చి 10:47 గంటలకు బయలుదేరుతుంది. అలాగే సెప్టెంబర్ 22న పుదుచ్చేరి నుండి బయలుదేరే రైలు నం. 11006 పుదుచ్చేరి-దాదర్ ట్రై-వీక్లీ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున 3:28 గంటలకు కుప్పం వద్ద ఆగి 3:30 గంటలకు బయలుదేరుతుంది.
ఈ అదనపు హాల్ట్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయి. ఇవి కుప్పం ప్రాంతానికి రైలు రవాణా సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు.
చర్లపల్లి-శ్రీకాకుళం స్పెషల్ ట్రైన్స్
హైదరాబాద్లోని చర్లపల్లి, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ఇరు మార్గాల్లో చెరో 8 ట్రిప్పుల చొప్పున మొత్తం 16 సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 6, 2026 నుంచి నవంబర్ 25, 2026 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
రైలు నంబర్ 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్) రైలు ప్రతి వారం మంగళవారం రోజున చార్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 6, 13, 20, 27 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 3, 10, 17, 24 తేదీలలో మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి.
రైలు నంబర్ 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి ) రైలు తిరుగు ప్రయాణంలో ప్రతి వారం బుధవారం రోజున శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 7, 14, 21, 28 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 4, 11, 18, 25 తేదీలలో మొత్తం 8 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.
{{/usCountry}}రైలు నంబర్ 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి ) రైలు తిరుగు ప్రయాణంలో ప్రతి వారం బుధవారం రోజున శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 7, 14, 21, 28 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 4, 11, 18, 25 తేదీలలో మొత్తం 8 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే జంక్షన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చిపురుపల్లి స్టేషన్లలో స్టాప్లు కల్పించారు.