Vijayasai Reddy Open Letter : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు, అధికార సమీకరణాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ వల్ల తనకు జరిగిన అవమానాలు, పార్టీ వీడటానికి గల కారణాలను ఆయన ఐదు పేజీల లేఖలో సమగ్రంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై "నమ్మకద్రోహి" అని వైసీపీ కోటరీ చేస్తున్న దుష్ప్రచారానికి ఈ లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
నా రక్తంలోనే నమ్మకద్రోహం లేదు…

"నేను నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ ఛార్జ్షీట్లలో నా పేరు లేకుండా చేసుకునేవాడిని" అని విజయసాయిరెడ్డి తన లేఖలో వ్యాఖ్యానించారు. జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నందుకే ఆయనతో పాటు ప్రతి ఛార్జ్షీట్లో తనను ఎ-2గా చేర్చారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉంటే, తాను కూడా 15 నెలలు జైలు జీవితం గడిపానని, నమ్మకద్రోహం చేసే మనస్తత్వమే ఉంటే ఆనాడే అప్రూవర్గా మారేవాడినని స్పష్టం చేశారు.
కేసుల్లో పేర్లు.. కోటరీ కుట్రలు
2024 ఎన్నికల తర్వాత కూడా తనకు ఎలాంటి సంబంధం లేని లిక్కర్ స్కామ్లో A-5గా, కాకినాడ సీపోర్టు కేసులో A-2గా తన పేరును చేర్చారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో "సకల శాఖ మంత్రి" పేరు మాత్రం ఏ ఛార్జ్షీట్లోనూ లేకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వెన్నుపోటు పొడుస్తూ, కేసులు లేకుండా ఎలా బయటపడాలో అక్కడ ఉన్న కోటరీ నాయకుడికి బాగా తెలుసని ధ్వజమెత్తారు.
సజ్జలే పార్టీకి నంబర్-1…
వైసీపీలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ, "ఇప్పుడు ఆ పార్టీలో నంబర్-2 జగన్ అయితే, నంబర్-1 సకల శాఖల మంత్రి సజ్జల" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. 2019 విజయాల తర్వాత సజ్జల రాజ్యాంగేతర శక్తిగా మారి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్మెంట్ దక్కకుండా గోడ కట్టారని ఆరోపించారు. 2022 మంగళగిరి ప్లీనరీలో సకల శాఖ మంత్రి తనపై భౌతికంగా దాడి చేసినా జగన్ ప్రేక్షకపాత్ర వహించారని, ఆ తర్వాత వరుసగా రీజినల్ కోఆర్డినేటర్, జిల్లా ఇన్ఛార్జ్, అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}వైసీపీలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ, "ఇప్పుడు ఆ పార్టీలో నంబర్-2 జగన్ అయితే, నంబర్-1 సకల శాఖల మంత్రి సజ్జల" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. 2019 విజయాల తర్వాత సజ్జల రాజ్యాంగేతర శక్తిగా మారి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్మెంట్ దక్కకుండా గోడ కట్టారని ఆరోపించారు. 2022 మంగళగిరి ప్లీనరీలో సకల శాఖ మంత్రి తనపై భౌతికంగా దాడి చేసినా జగన్ ప్రేక్షకపాత్ర వహించారని, ఆ తర్వాత వరుసగా రీజినల్ కోఆర్డినేటర్, జిల్లా ఇన్ఛార్జ్, అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}తన ఆత్మగౌరవాన్ని చంపుకుని సజ్జల కింద పనిచేయడం ఇష్టం లేకనే నాలుగేళ్ల రాజ్యసభ పదవీ కాలాన్ని, పార్టీని వదులుకున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ జగన్కు నమ్మకద్రోహం చేయలేదని… చేయబోనని స్పష్టం చేస్తూ, త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు.