Tirumala VIP Break Darshan Cancelled : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరిగింది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడం, దీనికి తోడు శని, ఆదివారాల వారాంతపు సెలవులు రావడంతో తిరుమల గిరులు భక్తజనసందోహంతో పోటెత్తాయి.

ఈ అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు వీలుగా రాబోయే సోమవారం(జూన్ 29) వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నిర్ణయం కారణంగా ఆదివారం రోజు ఎలాంటి వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను స్వీకరించబోరని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే నిబంధనల మేరకు దర్శన వసతి ఉంటుంది. దీనితో పాటు…. ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో ఏరోజుకారోజు భక్తులకు జారీ చేసే 800 శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను సైతం సోమవారం నాడు పూర్తిగా రద్దు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగానే తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
బాలాజీ నగర్ వరకు క్యూలైన్లు…..
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కాంప్లెక్స్ వెలుపల ఉన్న క్యూలైన్లు సైతం పూర్తిగా నిండిపోయి, బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు దర్శనం కావడానికి దాదాపు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంకా వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సీనియర్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీటీడీ పేర్కొంది.
{{/usCountry}}ఇంకా వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సీనియర్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీటీడీ పేర్కొంది.
{{/usCountry}}