అప్పన్నస్వామి భక్తులకు గుడ్‌న్యూస్.. విశాఖ టూ సింహాచలం డబుల్ డెక్కర్ బస్సు ప్రారంభం

సింహాచలం అప్పన్నస్వామి భక్తులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నం నుంచి సింహాచలం వరకు డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ ప్రారంభమైంది.

Published on: Dec 11, 2025 1:29 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలానికి సూపర్ జర్నీ అనుభూతి కలగనుంది. ఎందుకంటే విశాఖపట్నం నుంచి కొత్త డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. విశాఖపట్నంలో పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ గురువారం అధికారికంగా ప్రారంభమైందని పర్యాటక శాఖ అధికారులు ధృవీకరించారు. ఈ సేవ నగర పర్యాటకులకు, సింహాచలం అప్పన్న స్వామి ఆలయం దర్శనం వెళ్లే భక్తులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

డబుల్ డెక్కర్ సర్వీస్
డబుల్ డెక్కర్ సర్వీస్

ఈ సర్వీస్‌ను ప్రవేశపెట్టడంతో పర్యాటకాన్ని పెంచాలని, ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలలో సులభంగా చేరుకోవడానికి వీలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో చాలాసార్లు ఈ డబుల్ డెక్కర్ బస్సు ట్రయన్ రన్ చేస్తూ కనిపించింది. ఆర్కే బీచ్ నుండి సింహాచలం వరకు మార్గాన్ని కూడా ప్రయత్నించింది.

కాకినాడ-శ్రీశైలం బస్సు

మరోవైపు పలు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. కాకినాడ-శ్రీశైలం నడుమ వయా రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా కొత్త బస్సు సర్వీస్ నెంబర్ 2861ను నడుపుతున్నట్టుగా ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సు కాకినాడ డిపో నుంచి ప్రతిరోజు రాత్రి 7.45కు బయలుదేరి సామర్లకోట, పెద్దాపురం, రంగంపేట, రాజానగరం, రాజమహేంద్రవరం మీదుగా వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 8.15కు కాకినాడ చేరుకుంటుంది.

ఇంద్ర ఏసీ బస్సు ఛార్జీల తగ్గింపు

శ్రీకాకుళం నుంచి విజయవాడ మార్గంలో తిరిగే ఇంద్రా ఏసీ బస్సు ఛార్జీలు తగ్గింపును డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టుగా ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. శ్రీకాకుళం-విజయవాడ మార్గంలో నడిపే ఇంద్ర ఏసీ బస్సుల ఛార్జీలు 20 శాతం మేర తగ్గిస్తుంది. ఇది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉండనుంది. ప్రస్తుత ఛార్జీ రూ.928 నుంచి రూ.743కు అవుతుంది. శ్రీకాకుళం నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు, విజయవాడ నుంచి ప్రతీ రాత్రి 7.15 గంటలకు బస్సు బయలుదేరుతుంది.

అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీ పలు డిపోల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. శబరిమల, అరుణాచలం వెళ్లాలి అనుకునేవారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వివరాల కోసం దగ్గరలోని డిపోను సంప్రదించవచ్చు.