ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి(ఏప్రిల్ 1) నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో దాదాపు 80 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. టీటీడీకి చెందిన అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశాయి.

రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు.
రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తయింది.
కల్యాణ వేదిక ప్రాంగణంలో విశాలమైన 121 గ్యాలరీలను ఏర్పాటు చేసి, భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని కల్యాణోత్సవాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నారు. కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులందరికి శ్రీవారి సేవకులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన తలంబ్రాలను పంపిణీ చేశారు.
ప్రతి భక్తుడికి లెమన్ రైస్, కేసరి, బిస్కెట్ ప్యాకెట్, మ్యాంగో జ్యూస్, వాటర్ బాటిల్, స్వీట్, కారా పదార్థాలతో కూడిన కిట్ను అందజేశారు. గ్యాలరీలలో భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. నడిచి వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో, ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేలా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులను నడిపింది.
రామరాజ్యం స్థాపన : చంద్రబాబు
{{/usCountry}}ప్రతి భక్తుడికి లెమన్ రైస్, కేసరి, బిస్కెట్ ప్యాకెట్, మ్యాంగో జ్యూస్, వాటర్ బాటిల్, స్వీట్, కారా పదార్థాలతో కూడిన కిట్ను అందజేశారు. గ్యాలరీలలో భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. నడిచి వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో, ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేలా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులను నడిపింది.
రామరాజ్యం స్థాపన : చంద్రబాబు
{{/usCountry}}ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారికి సీఎం చంద్రబాబు పట్టవస్త్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం స్థాపన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలోని ప్రాచీన శ్రీ కోదండరామాలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం లభించినట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, దేవేంద్రుడు పాలించిన దేవతల రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రజల రాజధానిని అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రీరాముడు, శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు.