ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. పలు ప్రాంతాల్లో పగటిపూట తీవ్రమైన ఎండల తర్వాత సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) ఒక ప్రకటన జారీ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడింది. ఈ వ్యవస్థ ఛత్తీస్గఢ్పై ఉన్న ఉపరితల వాయుప్రసరణ నుండి ప్రారంభమై, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు గుండా ప్రయాణించి, మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించింది.
గురువారం, శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో గురువారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. శుక్రవారం కూడా ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, గాలుల తీవ్రత కాస్త తగ్గనుంది.
రాయలసీమలో గురువారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలుల సమయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా మెరుపులతో కూడిన వర్షం లేదా వడగళ్ళు కూడా పడవచ్చు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నప్పటికీ.. ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయి. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆకస్మిక వర్షాలు, బలమైన గాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున, పంటలకు నష్టం జరగకుండా కాపాడుకోవడానికి రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నప్పటికీ.. ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయి. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆకస్మిక వర్షాలు, బలమైన గాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున, పంటలకు నష్టం జరగకుండా కాపాడుకోవడానికి రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}