ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - రూ.18కే గోధుమ పిండి...! ఇవిగో వివరాలు

ఏపీలోని రేషన్ కార్డుదారులకు శుభవార్త వచ్చేసింది. జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్‌ దుకాణాల్లో గోధుమపిండిని కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 

Published on: Nov 12, 2025 8:39 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త వచ్చేసింది. పట్టణాల్లోని రేషన్‌ షాపుల్లో గోధుమపిండి కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.

రేషన్ సరుకుల పంపిణీ
రేషన్ సరుకుల పంపిణీ

ఇటీవలే ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి కేజీ గోధుమ పిండి కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన గోధుమ పిండిని అందజేస్తామని వివరించారు. ఫలితంగా ప్రస్తుతం ఇస్తున్నవి మాత్రమే కాకుండా… జనవరి 1వ తేదీ నుంచి రేషన్ కార్డుదారులు రూ. 18 చెల్లించి కేజీ గోధుమ పిండిని కూడా పొందవచ్చు.

ఈకేవైసీ తప్పనిసరి:

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రానివారికి కూడా వీటిని అందజేస్తున్నారు. కొత్తగా కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈకేవైసీ లేని కార్డులను పక్కన పెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు రేషన్ పంపిణీ కేంద్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.

స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవైసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.

ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.

రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

News/Andhra Pradesh/ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - రూ.18కే గోధుమ పిండి...! ఇవిగో వివరాలు
News/Andhra Pradesh/ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - రూ.18కే గోధుమ పిండి...! ఇవిగో వివరాలు