ప్రపంచం 2026కి స్వాగతం పలుకుతోంది. అయితే 2025లో అనేక ఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని నిర్మించాలని నిర్దేశించిన మూడేళ్ల కాలంలో దాదాపు సగం సమయం గడిచిపోతోంది. మూడు ప్రధాన ఆలయ విషాదాలతో వార్తల్లో నిల్చింది. తిరుపతి ఆలయంలో తొక్కిసలాట, సింహాచలం ఆలయంలో గోడ కూలిపోవడం, కాశీబుగ్గ ఆలయంలో రెయిలింగ్ కూలిపోవడం, ఈ ఘటనల్లో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మంది గాయపడ్డారు.

అక్టోబర్లో కర్నూలు జిల్లాలో బెంగళూరు వెళ్తున్న స్లీపర్ బస్సు మంటల్లో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు తీవ్రమైన మెుంథా తుపాను ముగ్గురు ప్రాణాలను బలిగొంది. కనీసం రూ. 5,233 కోట్ల నష్టం వాటిల్లింది.
నవంబర్లో మారేడుమిల్లి సమీపంలో జరిగిన రెండు వరుస ఎన్కౌంటర్లలో టాప్ నక్సలైట్ మడివి హిడ్మాతో సహా 13 మంది మావోయిస్టులు మరణించారు. ఇది ఉగ్రవాదాన్ని బలహీనపరిచింది. దేశం మెుత్తం ఏపీ వైపు చూసింది.
సీఎం చంద్రబాబు అమరావతి కలను సాకారం చేసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి 2026 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాజధాని నగర నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాలపరిమితితో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది. ఇందులో అధికారుల నివాసాలు (ఏప్రిల్ 2026), ట్రంక్ రోడ్లు (అక్టోబర్ 2026), లేఅవుట్ రోడ్లు (అక్టోబర్ 2027), ఐకానిక్ భవనాలు (ఏప్రిల్ 2028) నాటికి టార్గెట్ పెట్టుకుంది.
అమరావతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు గ్రామాల నుండి మరో 16,666 ఎకరాలు రెండో దశ ల్యాండ్ పూలింగ్ పథకం (LPS)ను ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 54,000 పూల్ చేసిన ఎకరాలకు అదనం. దీనిపై రైతులు విమర్శలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అమరావతి రాజధాని ప్రాజెక్టు మొదటి దశ కోసం భూమిని వదులుకున్న రైతులకు న్యాయం చేయాలని, రెండో దశ కోసం అదనపు భూమిని సమీకరించే ముందు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది.
పొరుగునే ఉన్న మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను అమరావతితో కలిపి మెగా సిటీని సృష్టించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. దీనికి 54,000 ఎకరాలకు అదనంగా మరింత భూమి అవసరం అంటున్నారు. సెప్టెంబర్ 2025లో అమరావతిలో చేపట్టిన అన్ని పనులు రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తవుతాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2028లో రాజధాని నగరాన్ని దేశానికి అంకితం చేస్తారని చెప్పారు.
{{/usCountry}}పొరుగునే ఉన్న మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను అమరావతితో కలిపి మెగా సిటీని సృష్టించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. దీనికి 54,000 ఎకరాలకు అదనంగా మరింత భూమి అవసరం అంటున్నారు. సెప్టెంబర్ 2025లో అమరావతిలో చేపట్టిన అన్ని పనులు రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తవుతాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2028లో రాజధాని నగరాన్ని దేశానికి అంకితం చేస్తారని చెప్పారు.
{{/usCountry}}అమరావతిని పూర్తి చేయడం క్వాంటం విజన్కు కూడా చాలా కీలకం. ఇది అమరావతిని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని క్వాంటం వ్యాలీని ప్రపంచంలోని టాప్ ఐదు క్వాంటం కంప్యూటింగ్ హబ్లలో ఒకటిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు క్వాంటం వ్యాలీ కోసం ప్రణాళికలను రూపొందించారు. ఇప్పటికే రూ. 3,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2026లో IBM నుండి రెండు క్వాంటం కంప్యూటర్లను వ్యవస్థాపించడానికి ప్రణాళిక చేశారు.
మరోవైపు విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల ఏఐ గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి, సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా సేకరించిన రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ (RTIHలు) ప్రారంభోత్సవం గత సంవత్సరంలో ప్రభుత్వం చేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. రాష్ట్రాన్ని కొక్త టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఇతర రంగాలకు నిలయంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక తల్లికి వందనం (పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ. 15,000), అన్నదాత సుఖీభవ (అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 20,000) అనే ఎన్నికల హామీని పాక్షికంగా నెరవేర్చారు. కానీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 భృతి, ఆడ బిడ్డ నిధి (19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నెలకు రూ. 1,500 సహాయం) వంటి ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు.
2025లో రైతులకు కనీస మద్దతు ధర (MSP), తుపాను బాధిత రైతులు, దళితులపై దౌర్జన్యాలు, కల్తీ మద్యం, నెరవేరని వాగ్దానాలు, అనేక ఇతర ప్రజా సమస్యలపై వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి నుండి చంద్రబాబు రాజకీయ సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ మోడల్కు వ్యతిరేకంగా వైసీపీ చేసిన ప్రచారం ప్రజలలో బాగా ప్రతిధ్వనించింది. ఈ చర్యకు వ్యతిరేకంగా వైస్ జగన్ కోటి సంతకాలను సేకరించగలిగారు. ఇలా ఏపీ ప్రభుత్వం 2025లో అనేక విషయాలను చూసింది.