YS Jagan On CM Chandrababu : కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల ప్రతినిధులపై అణచివేత చర్యలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నియంతలా మారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పూర్తిగా 'పోలీసు రాజ్యం' నడుస్తోందని దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లె గ్రామంలో తీవ్ర అన్యాయానికి గురైన కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ముఖ్య నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ సీనియర్ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పైశాచికంగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దారుణమన్నారు.
"శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి, బాధితులను పరామర్శించడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు అంత బీపీ వస్తోంది? ఎందుకీ ఫ్రస్టేషన్?" అని జగన్ ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను దాచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న కనీస మద్దతు ధర (MSP) రూ. 2,400 ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది రైతులకు కనీసం రూ. 1,400 నుంచి రూ. 1,600 కూడా దక్కలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో రైతులపై దాడులు చేయించడాని జగన్ ఆరోపించారు. పైగా ఆ రైతులపైనే అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోయినా రైతులు ప్రశ్నించకూడదా…? వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా…? అని ముఖ్యమంత్రిని నిలదీశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు దారుణం - వైెఎస్ జగన్
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మేధావులు, గౌరవప్రదమైన వ్యక్తులను సైతం ఈ ప్రభుత్వం వదలడం లేదని జగన్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టుగా, విశ్లేషకుడిగా, మాజీ ఎమ్మెల్సీగా నిత్యం ప్రజా సమస్యలపై గళం విప్పే ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పై చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్ని రాజకీయ పార్టీల విధానాలపైనా, సామాజికాంశాలపైనా నిష్పాక్షికంగా విశ్లేషణలు చేస్తారని.. అటువంటి వ్యక్తి నిజం మాట్లాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, విమర్శిస్తే వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు 'జంగిల్ రాజ్' (అరాచక రాజ్యం) గా మార్చేశారని దుయ్యబట్టారు.
పోరాటం ఆగదు - వైఎస్ జగన్
{{/usCountry}}ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మేధావులు, గౌరవప్రదమైన వ్యక్తులను సైతం ఈ ప్రభుత్వం వదలడం లేదని జగన్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టుగా, విశ్లేషకుడిగా, మాజీ ఎమ్మెల్సీగా నిత్యం ప్రజా సమస్యలపై గళం విప్పే ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పై చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్ని రాజకీయ పార్టీల విధానాలపైనా, సామాజికాంశాలపైనా నిష్పాక్షికంగా విశ్లేషణలు చేస్తారని.. అటువంటి వ్యక్తి నిజం మాట్లాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, విమర్శిస్తే వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు 'జంగిల్ రాజ్' (అరాచక రాజ్యం) గా మార్చేశారని దుయ్యబట్టారు.
పోరాటం ఆగదు - వైఎస్ జగన్
{{/usCountry}}చంద్రబాబు ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని… ప్రజలు ఈ అణచివేతను ఎల్లకాలం సహించరని జగన్ హెచ్చరించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, పోలీసులను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని ప్రశ్నించారు. ప్రజాపక్షాన నిలబడి పోరాడటమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. ప్రభుత్వ అక్రమాలు, కక్షసాధింపు చర్యలపై తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని… ఎల్లప్పుడూ ప్రజలకు అండగా వైసీపీ గళం విప్పుతూనే ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.