కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ….. కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే అన్నారు. రాజకీయాల్లో యువతంతా తులసి మొక్కల్లా ఎదగాలని… యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంట్లే మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకలెక్కా….? అని ప్రసంగించారు.
చంద్రబాబు వచ్చాక అవన్నీ ఆగిపోయాయి - జగన్
“ఓటు హక్కు లేదు కనుక విద్యార్థుల గురించి ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడు. ఇంగ్లీష్ మీడియం నుంచి నాడు నేడుదాకా వారి గురించి అడుగులు వేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రభుత్వ బడులు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ఉన్నప్పుడే పేదవాడి జీవితం మారుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ఇంప్రూవ్ చేశాం. తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన తెచ్చాం. కానీ చంద్రబాబు వచ్చాక అన్నీ ఆగిపోయాయి” అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“2018-19లో జీఈఆర్ (Gross Enrolment Ratio) రేషియో 27.86 శాతం ఉంటే వైసీపీ హయాంలో 37 శాతానికి పెరిగింది. ఫీజులు కట్టలేక ఇప్పుడది మళ్లీ రివర్స్ అయింది. మన ప్రభుత్వ హయాంలో 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలోనే ఇచ్చాం. ఇవి కాక ఎంఎస్ఎంఈలకు చంద్రబాబు పెట్టిన బకాయిలు తీర్చి రాయితీలు ఇవ్వడంతో, కార్పొరేట్ సంస్థల కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను MSMEలే కల్పించాయి” అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
{{/usCountry}}“2018-19లో జీఈఆర్ (Gross Enrolment Ratio) రేషియో 27.86 శాతం ఉంటే వైసీపీ హయాంలో 37 శాతానికి పెరిగింది. ఫీజులు కట్టలేక ఇప్పుడది మళ్లీ రివర్స్ అయింది. మన ప్రభుత్వ హయాంలో 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలోనే ఇచ్చాం. ఇవి కాక ఎంఎస్ఎంఈలకు చంద్రబాబు పెట్టిన బకాయిలు తీర్చి రాయితీలు ఇవ్వడంతో, కార్పొరేట్ సంస్థల కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను MSMEలే కల్పించాయి” అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
{{/usCountry}}“డేటా సెంటర్ కి సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. సింగపూర్ నుంచి డేటా విశాఖకు తేవడానికి అవసరమైన కేబుల్ ను ఏర్పాటు చేసింది వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనే. 2022లోనే 300 మెగావాట్లకు సంబంధించిన అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం” అని జగన్ చెప్పుకొచ్చారు.
“చంద్రబాబు చేస్తున్న అతి దరిద్రమైన పని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడమే. తాను మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల వల్ల టీచింగ్ హాస్పటల్ అందుబాటులోకి వచ్చి పేదలు, మధ్యతరగతికి ఉచిత వైద్య సేవలు లభిస్తాయి. ఈ 17ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల 2,550 మెడికల్ సీట్లు వస్తాయి. ఇప్పటికే 7 కాలేజీలూ పూర్తి అయ్యాయి, ఏడాదికి 5వేల కోట్లు ఖర్చు చేస్తే మిగతా 10 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి కానీ చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు” అని జగన్ ఆరోపించారు.