వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. వరుడు ఎవరో తెలుసా?
తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్టుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వరుడి కుటుంబం కర్నూలు కాగా.. అమెరికాలో స్థిరపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ వార్తను వైఎస్ షర్మిల స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. సోమల సుబ్బా రెడ్డి కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనున్నట్లు ఆమె తెలిపారు.

'నా భర్త అనిల్ కుమార్, నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కుమార్తె వివాహానికి సంబంధించిన ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కుమార్తె అంజలి రెడ్డి, డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డిల వివాహబంధానికి మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలు, శుభాకాంక్షలు కావాలని కోరుకుంటున్నాం.' అని వైఎస్ షర్మిల రాసుకొచ్చారు.
వరుడు రఘురామ్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వివరాలను కూడా షర్మిల పంచుకున్నారు. వీరి కుటుంబం మూలాలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినవి కాగా, ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులుగా అక్కడే స్థిరపడ్డారు. వృత్తిరీత్యా డాక్టర్ రఘురామ్ రెడ్డి అమెరికాలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్సార్ కడప జిల్లాకు చెందింది కాగా, వరుడి కుటుంబం రాయలసీమకే చెందిన కర్నూలు జిల్లాకు సంబంధించింది కావడం విశేషం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మనవరాలు, షర్మిల కుమార్తె అయిన అంజలి రెడ్డి విద్యాభ్యాసం విదేశాల్లోనే సాగింది. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ముగిసిన కొద్ది నెలల్లోనే ఇప్పుడు కుమార్తె అంజలి రెడ్డి వివాహం జరగనుంది.
ఈ జంట నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలను, వేదిక వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. రాజారెడ్డి పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైనట్లే, అంజలి రెడ్డి వివాహ వేడుకను కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


